Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రెజర్ కుక్కర్‌‌లో బంగారం.. కేరళ ఎయిర్‌పోర్టులో సీజ్ చేసిన పోలీసులు

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (11:37 IST)
Cooker
కేరళ విమానాశ్రయంలో అక్రమంగా బంగారం తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. జెడ్డా నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడి నుంచి సుమారు 700 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్‌కు చెందిన అధికారులు అతన్ని పట్టుకున్నారు. ప్రెజర్ కుక్కర్‌లో బంగారాన్ని తీసుకు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 
 
కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జెడ్డా నుండి ఎస్జీ 9760 విమానంలో హమ్జా అనే ప్రయాణికుడు ఈ బంగారాన్ని తరలించేందుకు ప్రయత్నించాడు. ప్రెజర్ కుక్కర్ దిగువన ఉన్న ఒక ప్రత్యేక కంపార్ట్‌మెంట్‌లో బంగారం దాచబడింది. ఇక స్వాధీనం చేసుకున్న బంగారం మార్కెట్ విలువ సుమారు రూ .36 లక్షలు అని పోలీసులు తెలిపారు. 
 
విమానాశ్రయ ఇంటెలిజెన్స్ యూనిట్ డిప్యూటీ కమిషనర్ డా. ఐఎన్‌ఎస్ రాజి, సూపరింటెండెంట్లు సి గోకుల్‌దాస్, గణపతి పొట్టి, ఇన్‌స్పెక్టర్లు నరసింహ నాయక్, ప్రమోద్, ప్రణయ్ కుమార్, శివానీ, హెడ్ హవిల్దార్ చంద్రన్లతో కూడిన బృందం ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకుంది.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments