Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌ను చైనా బెదిరింపులకు గురిచేస్తోందా? డొనాల్ట్ ట్రంప్ ఏమన్నారు?

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (11:14 IST)
భారత్‌-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. ఇరు దేశాల మధ్య పరిస్థితులు అత్యంత దారుణంగా తయారయ్యాయని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో చైనా అత్యంత దూకుడుగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఉభయ దేశాల మధ్య కలగజేసుకొని సాయం చేయడానికి తాను ఇష్టపడుతున్నానని చెప్పుకొచ్చారు.
 
ఇందులో భాగంగా ఇరు వర్గాలతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. భారత్‌ను చైనా బెదిరింపులకు గురిచేస్తోందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ''అలా ఏమీ లేదు. కానీ, ఆ దిశగా అడుగులు వేస్తోంది. చాలా మంది అంచనాల కంటే బలంగా, వేగంగా ముందుకు వెళుతోంది'' అని వ్యాఖ్యానించారు.
 
లడాఖ్‌లో ఘర్షణ వాతావరణం ప్రారంభమైన సందర్భంలో, గల్వాన్‌ ఘటనా సమయంలోనూ ఇరు దేశాల మధ్య సయోధ్య కుదర్చడానికి తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్‌ తెలిపారు. ఆయన ప్రతిపాదనను ఉభయ దేశాలూ తిరస్కరించాయి. ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు, ద్వైపాక్షిక చర్చల్లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం దౌత్య మార్గాల ద్వారా వివాదాల్ని పరిష్కరించుకుంటామని తెలిపాయి. ఇందులో ఇతర దేశాల జోక్యం అవసరం లేదని తేల్చి చెప్పాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments