Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్ రాజకీయం రసవత్తరం : బీజేపీలోకి కెప్టెన్?

Webdunia
మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (14:26 IST)
పంజాబ్ రాజకీయాలు రోజుకోరీతిలో మారిపోతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పార్టీ మారబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటన ఇపుడు కాంగ్రెస్ పార్టీతో పాటు.. పంజాబ్ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. 
 
పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మాటలు విని తనను సీఎం పీఠ నుంచి తొలగించడాన్ని మాజీ ముఖ్యమంత్రి అమరీదర్ సింగ్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులోభాగంగా, ఆయన బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డాతో సమావేశమయ్యేందుకు హస్తిన బాట పట్టినట్టు సమాచారం. 
 
ఈ పరిణామంతో పంజాబ్‌ రాజకీయం మరింత వేడెక్కింది. అయితే అమరీందర్‌ సింగ్‌ బీజేపీలో చేరితే మాత్రం కాంగ్రెస్‌కు ఊహించని దెబ్బ తగలనుంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో విబేధాలు తారస్థాయికి చేరాయి.
 
ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూకు, అమరీందర్‌ సింగ్‌కు అసలు పొసగడం లేదు. ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఈ విబేధాలు కొనసాగుతున్నాయి. అయితే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ అధిష్టానం మధ్యే మార్గంగా అమరీందర్‌సింగ్‌ను దింపేసి దళిత వర్గానికి చెందిన చన్నీని ముఖ్యమంత్రిగా నియమించింది. దీంతో అమరీందర్ సింగ్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments