Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్ రాజకీయం రసవత్తరం : బీజేపీలోకి కెప్టెన్?

Webdunia
మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (14:26 IST)
పంజాబ్ రాజకీయాలు రోజుకోరీతిలో మారిపోతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పార్టీ మారబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటన ఇపుడు కాంగ్రెస్ పార్టీతో పాటు.. పంజాబ్ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. 
 
పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మాటలు విని తనను సీఎం పీఠ నుంచి తొలగించడాన్ని మాజీ ముఖ్యమంత్రి అమరీదర్ సింగ్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులోభాగంగా, ఆయన బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డాతో సమావేశమయ్యేందుకు హస్తిన బాట పట్టినట్టు సమాచారం. 
 
ఈ పరిణామంతో పంజాబ్‌ రాజకీయం మరింత వేడెక్కింది. అయితే అమరీందర్‌ సింగ్‌ బీజేపీలో చేరితే మాత్రం కాంగ్రెస్‌కు ఊహించని దెబ్బ తగలనుంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో విబేధాలు తారస్థాయికి చేరాయి.
 
ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూకు, అమరీందర్‌ సింగ్‌కు అసలు పొసగడం లేదు. ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఈ విబేధాలు కొనసాగుతున్నాయి. అయితే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ అధిష్టానం మధ్యే మార్గంగా అమరీందర్‌సింగ్‌ను దింపేసి దళిత వర్గానికి చెందిన చన్నీని ముఖ్యమంత్రిగా నియమించింది. దీంతో అమరీందర్ సింగ్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments