దేశంలో భారీగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (14:22 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 20 వేలకు దిగువకు చేరుకున్నాయి. మంగళవారం కేంద్ర వైద్య ఆరోగ్యం శాఖ వెల్లడించిన వివరాల మేరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 18,795 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 
 
దీంతో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 3,36,97,581కు చేరింది. గడచిన 24 గంటల్లో 26,030 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య‌ 32,9,58,002కు చేరింది. 
 
అదేవిధంగా 24 గంటల్లో 179 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,47,373కు చేరింది. 2,92,206 మంది ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స అందుతోంది. 
 
మ‌రోవైపు, కేర‌ళ‌లో కొత్తగా 11,699 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. నిన్న 58 మంది మృతి చెందారు. నిన్న రికార్డు స్థాయిలో 1,02,22,525 మందికి వ్యాక్సిన్ డోసులు వేశారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 87,07,08,636 వ్యాక్సిన్ డోసుల‌ను వినియోగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనిల్ రావిపూడికి ఖరీదైన బహుమతి ఇచ్చిన మెగాస్టార్

'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ నుంచి అదిరిపోద్ది సంక్రాంతి ఫుల్ సాంగ్

శంబాల లో నాకు అద్భుతమైన పాత్ర దక్కింది, నటుడిగా గుర్తింపునిచ్చింది : శివకార్తిక్

మర్దానీ 3 ట్రైలర్ నన్ను కదిలించిందన్న హర్మన్‌ ప్రీత్ కౌర్

మగాడిపై సానుభూతి కలిగించేలా పురుష: నుంచి కీరవాణి పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments