Webdunia - Bharat's app for daily news and videos

Install App

బావి మాయమైంది.. వెతికిపెట్టండి.. కర్ణాటకలో వింత ఘటన

Webdunia
బుధవారం, 7 జులై 2021 (13:42 IST)
ఏదో సినిమాలో పొలంలో చేపల చెరువును ఎవరో దొంగలించారని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఎలాగైనా పోలీసులు త‌న చేప‌ల చెరువును వెతికి ప‌ట్టుకోవాల‌ని పోలీసుల‌తో పాటు అధికారుల‌ను ముప్పుతిప్ప‌లు పెడ‌తాడు. అచ్చంగా అలాంటి ఘ‌ట‌న‌నే క‌ర్ణాట‌క రాష్ట్రంలో జ‌రిగింది. అయితే.. ఇక్క‌డ పోయింది చేప‌ల చెరువు కాదండి.. ఓ బావి.
 
వివ‌రాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం బెళగావి జిల్లాలోని భేండవాడ గ్రామ పంచాయతీ పరిధి మావినహొండ గ్రామంలో మ‌ల్ల‌ప్ప అనే రైతు త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తున్నాడు. కాగా.. మంగ‌ళ‌వారం అత‌డు తన పొలంలోని బావి కనిపించడం లేదని, ఎలాగైనా దానిని వెతికి పెట్టాలని రాయబాగ్‌ పోలీసు స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తొలుత రైతు ఇచ్చిన ఫిర్యాదు చూసి పోలీసులు షాక్‌కు గుర‌య్యారు. తీరా అస‌లు నిజం తెలుసుకుని ద‌ర్యాప్తు చేపట్టారు. 
 
అసలు నిజం ఏమిటంటే.. మల్లప్ప పొలంలో బావిని తవ్వినట్టు పంచాయతీ అధికారులు రికార్డులు సృష్టించి, ప్రభుత్వ నిధులు కాజేశారు. అంతేకాక, బావి తవ్వించినందుకు తీసుకున్న రుణం తిరిగి చెల్లించాలంటూ రైతుకు నోటీసులు కూడా పంపారు. దీంతో విస్తుపోయిన రైతు పోలీసులను ఆశ్రయించడంతో అధికారుల బాగోతం బయటపడింది. ప్ర‌స్తుతం దీని పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments