Webdunia - Bharat's app for daily news and videos

Install App

బావి మాయమైంది.. వెతికిపెట్టండి.. కర్ణాటకలో వింత ఘటన

Webdunia
బుధవారం, 7 జులై 2021 (13:42 IST)
ఏదో సినిమాలో పొలంలో చేపల చెరువును ఎవరో దొంగలించారని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఎలాగైనా పోలీసులు త‌న చేప‌ల చెరువును వెతికి ప‌ట్టుకోవాల‌ని పోలీసుల‌తో పాటు అధికారుల‌ను ముప్పుతిప్ప‌లు పెడ‌తాడు. అచ్చంగా అలాంటి ఘ‌ట‌న‌నే క‌ర్ణాట‌క రాష్ట్రంలో జ‌రిగింది. అయితే.. ఇక్క‌డ పోయింది చేప‌ల చెరువు కాదండి.. ఓ బావి.
 
వివ‌రాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం బెళగావి జిల్లాలోని భేండవాడ గ్రామ పంచాయతీ పరిధి మావినహొండ గ్రామంలో మ‌ల్ల‌ప్ప అనే రైతు త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తున్నాడు. కాగా.. మంగ‌ళ‌వారం అత‌డు తన పొలంలోని బావి కనిపించడం లేదని, ఎలాగైనా దానిని వెతికి పెట్టాలని రాయబాగ్‌ పోలీసు స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తొలుత రైతు ఇచ్చిన ఫిర్యాదు చూసి పోలీసులు షాక్‌కు గుర‌య్యారు. తీరా అస‌లు నిజం తెలుసుకుని ద‌ర్యాప్తు చేపట్టారు. 
 
అసలు నిజం ఏమిటంటే.. మల్లప్ప పొలంలో బావిని తవ్వినట్టు పంచాయతీ అధికారులు రికార్డులు సృష్టించి, ప్రభుత్వ నిధులు కాజేశారు. అంతేకాక, బావి తవ్వించినందుకు తీసుకున్న రుణం తిరిగి చెల్లించాలంటూ రైతుకు నోటీసులు కూడా పంపారు. దీంతో విస్తుపోయిన రైతు పోలీసులను ఆశ్రయించడంతో అధికారుల బాగోతం బయటపడింది. ప్ర‌స్తుతం దీని పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments