Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ డిప్యూటీ సీఎం నివాసంతో సహా 21 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు

Webdunia
శుక్రవారం, 19 ఆగస్టు 2022 (12:15 IST)
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసంతో సహా ఏకంగా 21 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సోదాలకు దిగారు. ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త అబ్కారీ విధానాన్ని వెనక్కి తీసుకుంది. దీని వెనుక కోట్లాది రూపాయల కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
 
ఇందులో ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాతో సహా మొత్తం నలుగురు ప్రజాప్రతినిధులపై అభియోగాలు నమోదు చేసింది. పైగా, మనీశ్ సిసోడియాను న్యూయార్క్ టైమ్స్ ప్రశంసిచిన రోజునే ఆయన నివాసంతో పాటు 21 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు చేయడం గమనార్హం. 
 
అంతకుముందు అబ్కారీ విధానంలో అవకతవకలు జరిగినట్టు నివేదిక రావడంతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐ విచారణకు ఆదేశించిన విషయం తెల్సిందే. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ విచారణ చేపట్టింది. "మేక్ ఇన్ ఇండియా" పేరిట ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దేశ వ్యాప్త ప్రచార కార్యక్రమం ప్రారంభించిన రెండు రోజుల్లోనే ఈ సోదాలు జరగడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం