ఆంధ్రా మరో శ్రీలంక కాకతప్పదా? 7 శాతం వడ్డీతో రూ.వెయ్యి కోట్లు అప్పు

Webdunia
శుక్రవారం, 19 ఆగస్టు 2022 (11:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుల ఊబిలో కూరుకునిపోతోంది. అందుబాటులో ఉన్న ప్రతి చోటా అప్పులు తీసుకుంటుంది. ఈ విషయంపై ఇప్పటికే విపక్ష నేతలు గగ్గోలు పెడుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో తాజాగా 7 శాతం వడ్డీకి మరో వెయ్యి కోట్లను అప్పుగా తీసుకుంది. ఇందులో 7.72 శాతం వడ్డీతో రూ.500 కోట్లు, మరో రూ.500 కోట్లను 7.74 శాతం వడ్డీకి భారత రిజర్వు బ్యాంకు నుంచి అప్పుగా తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఏకంగా రూ.34,980 కోట్ల రుణం తీసుకుంది. 
 
వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో రూ.43,803 కోట్ల మేరకు బహిరంగ రుణాన్ని తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే కేవలం నాలుగున్నర నెలలోనే ఏకంగా రూ.34 వేల కోట్లకుపైగా ఏపీ రుణం తీసుకుని సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగితే ఏపీ రాష్ట్రం కూడా మరో శ్రీలంక కాకతప్పదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: వార్నింగ్ లు రాజకీయాల్లోనే సినిమాల్లో కాదు - హీరోలపైనా బండ్ల గణేష్ సెటైర్

Kiran Abbavaram: K-ర్యాంప్ కలెక్షన్ల కంటే ఆడియెన్స్ నవ్వులే నాకు సంతృప్తి : కిరణ్ అబ్బవరం

Meenakshi: ఎన్.సి.24 చిత్రం నుంచి పరిశోధకరాలిగా మీనాక్షి చౌదరి లుక్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments