Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరూ టెన్షన్ పడొద్దు... అత్యాచారం వంటి నేరం చేయలేదు : డీకే శివకుమార్

Webdunia
శుక్రవారం, 30 ఆగస్టు 2019 (13:05 IST)
కర్నాటక రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, మాజీ మంత్రి డీకే శివకుమార్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు సమన్లు జారీచేశారు. మనీలాండరింగ్ కేసులో ఆయనకు గురువారం రాత్రి సమన్లు జారీ చేసి శుక్రవారం విచారణకు హాజరుకావాలంటూ అందులో పేర్కొన్నారు. దీనిపై డీకే శివకుమార్ స్పందించారు. 
 
'నేను టెన్షన్ పడడం లేదు. ఎవరూ టెన్షన్ పడొద్దు. నేను ఏ తప్పూ చేయలేదు. అత్యాచారం వంటి నేరం కానీ, ఎవరి వద్ద నుంచైనా డబ్బు తీసుకోవడం కానీ చేయలేదు. నాకు వ్యతిరేకంగా ఏమీ లేదు' అని అన్నారు. 
 
అంతేకాకుండా 'నిన్న రాత్రి 9.40 గంటలకు ఈడీ సమన్లను అందుకున్నా. ఢిల్లీలో ఈ మధ్యాహ్నం ఒంటి గంటకు విచారణకు హాజరుకావాలని అందులో ఉంది. విచారణకు హాజరుకావాలంటూ హఠాత్తుగా సమన్లు ఇవ్వడం సరైన చర్య కాకపోయినా... చట్టంపై ఉన్న గౌరవంతో నేను విచారణకు హాజరవుతాను. విచారణకు పూర్తిగా సహకరిస్తా' అని తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
పైగా, తనకు రాజకీయ దురుద్దేశ్యంతోనే సమన్లు జారీ చేశారని చెప్పారు. తాను ఎలాంటి తప్పుకు పాల్పడలేదని స్పష్టం చేశారు. కాగా, గత కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ సర్కారులో ఈయన అత్యంత కీలక పాత్రను పోషించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

Imanvi: ప్రభాస్ సినిమాలో పాకిస్థాన్ నటి ఇమాన్విని తొలగించండి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments