Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 12 March 2025
webdunia

జైపాల్ రెడ్డి పాడె మోసిన కర్నాటక మాజీ స్పీకర్ రమేశ్ కుమార్..

Advertiesment
జైపాల్ రెడ్డి పాడె మోసిన కర్నాటక మాజీ స్పీకర్ రమేశ్ కుమార్..
, సోమవారం, 29 జులై 2019 (20:46 IST)
హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులో పీవీ ఘాట్‌ సమీపంలో నిర్వహించిన జైపాల్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నకర్నాటక మాజీ స్పీకర్ రమేష్, జైపాల్‌ పాడెను భుజానకెత్తుకుని మోశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రమేశ్, జైపాల్ మరణంతో ఇంట్లో పెద్ద దిక్కు పోయినట్టనిపిస్తోందన్నారు. 
 
జైపాల్‌తో తనది 35 ఏళ్లకు పైబడిన అన్నదమ్ముల బంధమన్నారు. కర్ణాటక అసెంబ్లీలో తాను వ్యవహరించిన తీరుపై జైపాల్‌ రెడ్డికి వివరించాలని ఇక్కడికి వద్దామనుకున్నానన్నారు. కానీ భగవంతుడు తనకు ఆ ఛాన్స్‌ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. 
 
కష్టకాలంలో సైతం తప్పులు చేయకూడదని.. సైద్ధాంతిక నిబద్ధతతో ఉండాలని చెప్పిన మహానుభావుడన్నారు. తాను తప్పు చేస్తే జైపాల్ రెడ్డి మందలించేవారని, నాకు ఎన్నో సలహాలు సూచనలు అందించేవారని గుర్తుచేసుకున్నారు రమేశ్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబుకు పట్టిన గతే మమతకు పడుతుంది... కృష్ణం రాజు