Webdunia - Bharat's app for daily news and videos

Install App

అండమాన్, అస్సాంలో భూప్రకంపనలు

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (10:25 IST)
భారతదేశంలో వరుస భూకంపాలు అలజడిని సృష్టిస్తున్నాయి. ఇటీవలకాలంలో ఢిల్లీ – ఎన్‌సీఆర్, బీహార్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించిన విషయం తెలిసిందే. తాజాగా అస్సాం, అండమాన్ నికోబార్ దీవుల్లో భూప్రకంపనలు సంభవించాయి.

సోమవారం అర్థరాత్రి 11.51 గంటలకు అండమాన్ నికోబార్ దీవుల్లో భూమి కంపించింది. అదేవిధంగా మంగళవారం తెల్లవారుజామున 1.32 గంటలకు అస్సాంలోని మొరిగావ్‌లో భూకంపం సంభవించింది.

ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ మంగళవారం ఉదయం వెల్లడించింది. అందరూ నిద్రిస్తున్న వేళ అకస్మాత్తుగా భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు ఇళ్లల్లోనుంచి పరుగులు తీశారు. భయాందోళనతో చాలాసేపటి వరకు బహిరంగ ప్రాంతంలోనే ఉన్నారు.
 
అయితే అండమాన్ నికోబార్ దీవుల్లో సంభవించిన భూకంపం.. రిక్టర్ స్కేల్‌లో 4.2 తీవ్రతగా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది.

దీంతోపాటు అస్సాంలోని మొరిగావ్‌లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 2.9 గా నమోదయిందని తెలిపింది. అయితే ఇప్పటివరకు రెండు ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన సమాచారం ఏదీ అందలేదని సీస్మోలజీ అధికారులు వెల్లడించారు.
 
ఉత్తర భారతదేశంలో వరుసగా సంభవిస్తున్న భూకంపాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇటీవల ఢిల్లీ – ఎన్‌సీఆర్‌, నోయిడా, బీహార్, ఉత్తరాఖండ్ తదితర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. అయితే స్వల్ప భూకంపాలతో ఎలాంటి ప్రమాదమీలేదని అధికారులు వెల్లడిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments