Webdunia - Bharat's app for daily news and videos

Install App

అండమాన్, అస్సాంలో భూప్రకంపనలు

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (10:25 IST)
భారతదేశంలో వరుస భూకంపాలు అలజడిని సృష్టిస్తున్నాయి. ఇటీవలకాలంలో ఢిల్లీ – ఎన్‌సీఆర్, బీహార్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించిన విషయం తెలిసిందే. తాజాగా అస్సాం, అండమాన్ నికోబార్ దీవుల్లో భూప్రకంపనలు సంభవించాయి.

సోమవారం అర్థరాత్రి 11.51 గంటలకు అండమాన్ నికోబార్ దీవుల్లో భూమి కంపించింది. అదేవిధంగా మంగళవారం తెల్లవారుజామున 1.32 గంటలకు అస్సాంలోని మొరిగావ్‌లో భూకంపం సంభవించింది.

ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ మంగళవారం ఉదయం వెల్లడించింది. అందరూ నిద్రిస్తున్న వేళ అకస్మాత్తుగా భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు ఇళ్లల్లోనుంచి పరుగులు తీశారు. భయాందోళనతో చాలాసేపటి వరకు బహిరంగ ప్రాంతంలోనే ఉన్నారు.
 
అయితే అండమాన్ నికోబార్ దీవుల్లో సంభవించిన భూకంపం.. రిక్టర్ స్కేల్‌లో 4.2 తీవ్రతగా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది.

దీంతోపాటు అస్సాంలోని మొరిగావ్‌లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 2.9 గా నమోదయిందని తెలిపింది. అయితే ఇప్పటివరకు రెండు ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన సమాచారం ఏదీ అందలేదని సీస్మోలజీ అధికారులు వెల్లడించారు.
 
ఉత్తర భారతదేశంలో వరుసగా సంభవిస్తున్న భూకంపాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇటీవల ఢిల్లీ – ఎన్‌సీఆర్‌, నోయిడా, బీహార్, ఉత్తరాఖండ్ తదితర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. అయితే స్వల్ప భూకంపాలతో ఎలాంటి ప్రమాదమీలేదని అధికారులు వెల్లడిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments