Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపోలో ఆసుపత్రిలో మణిరత్నం... గుండెపోటా? కాదు కాదంటున్న పీఆర్వో

దక్షిణాది సినీ దర్శకుడు, నటి సుహాసిని భర్త మణిరత్నంకు గుండెపోటు వచ్చిందంటూ వార్తలు వచ్చాయి. గుండెపోటు రావడంతో ఆయనను వెంటనే చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారని పలు మీడియాల్లో కథనాలు వచ్చాయి. ఐతే దీనిపై మణిరత్నం పీఆర్వో నిఖిల్ మురుగున్ స్పందిస్తూ... మణి

Webdunia
గురువారం, 26 జులై 2018 (16:43 IST)
దక్షిణాది సినీ దర్శకుడు, నటి సుహాసిని భర్త మణిరత్నంకు గుండెపోటు వచ్చిందంటూ వార్తలు వచ్చాయి. గుండెపోటు రావడంతో ఆయనను వెంటనే చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారని పలు మీడియాల్లో కథనాలు వచ్చాయి. ఐతే దీనిపై మణిరత్నం పీఆర్వో నిఖిల్ మురుగున్ స్పందిస్తూ... మణిరత్నం బాగానే వున్నారని ట్వీట్ చేశారు.
 
కేవలం రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసమే అపోలో ఆసుపత్రికి వచ్చినట్లు తెలిపారు. ఆయన ఆరోగ్యానికి ఎలాంటి సమస్య లేదని వెల్లడించారు. కాగా ఇంతకుముందు ఓసారి మణిరత్నం గుండె సంబంధ సమస్యను ఎదుర్కొన్నారు. ఇప్పుడు అపోలో ఆసుపత్రికి వెళ్లగానే అంతా అదేననుకుని వార్తలు రాశారు. ఇకపోతే ప్రస్తుతం మణిరత్నం తన తదుపరి చిత్రం చెక్క చివంత వనం మూవీ పోస్టు ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తెలుగులో నవాబ్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు

గుంటూరు కారం మెట్టు దిగింది.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో అజిత్‌తో శ్రీలీల

నా సినిమాల గురించి నికోలయ్ నిర్మొహమాటంగా చెబుతారు : శబరి నటి వరలక్ష్మీ శరత్ కుమార్

ఆశిష్, వైష్ణవి చైతన్య, దిల్‌రాజు ప్రొడక్షన్స్ లవ్ మీ- ఇఫ్ యు డేర్

కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది

పృథ్వీ హీరోగా, రూపాలి, అంబిక హీరోయిన్లుగా చిత్రం ప్రారంభం

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

రొమ్ము క్యాన్సర్ శస్త్ర చికిత్సలో మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ వినూత్నమైన మత్తు విధానం

డ్రై ఫ్రూట్స్ హల్వా తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments