ముస్లింల జనాభాపై తప్పుడు ప్రచారం : దిగ్విజయ్ సింగ్

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (16:26 IST)
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2028 నాటికి హిందువులు, ముస్లింల్లో సంతాన సాఫ‌ల్య రేటు ఒకే విధంగా ఉంటుంద‌న్నారు. గతంలో వెల్లడైన గణాంకాల మేరకు 1951 నుంచి ముస్లింల్లో సంతానోత్ప‌త్తి రేటు హిందువుల‌తో పోలిస్తే అధికంగా త‌గ్గుతోందన్నారు. 
 
కానీ, ప్ర‌స్తుతం ముస్లింల్లో సంతాన సాఫ‌ల్య రేటు 2.7 శాతం కాగా, హిందువుల్లో ఇది 2.3 శాతంగా ఉంద‌ని.. 2028 నాటికి ఇది హిందూ, ముస్లింలలో స‌మానంగా ఉంటుంద‌ని దిగ్విజ‌య్ సింగ్ వ్యాఖ్యానించారు. 
 
ముస్లింల జ‌నాభా పెరుగుతోంద‌ని త్వ‌ర‌లో వారి జ‌నాభా హిందువుల‌ను అధిగ‌మిస్తుంద‌ని కొంద‌రు పేర్కొంటున్న నేప‌థ్యంలో దిగ్విజ‌య్ సింగ్ ఈ వ్యాఖ్య‌లు చేయడం గమనార్హం. 
 
ముస్లింల జ‌నాభా పెరుగుద‌ల గురించి త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని అంటూ ఈ అంశంపై బ‌హిరంగ చ‌ర్చ‌కు రావాల‌ని మోహ‌న్ భ‌గ‌వ‌త్ స‌హా ఆరెస్సెస్ ప్ర‌చార‌క్‌ల‌కు ఆయ‌న స‌వాల్ విసిరారు. ముస్లింల సంతానోత్ప‌త్తి రేటు త‌గ్గుతున్న‌ద‌ని, హిందువుల కంటే ముస్లింలు ఈ దేశంలో ఎన్న‌డూ మెజారిటీలు కాబోర‌ని తాను నిరూపిస్తాన‌ని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

HBD Rajamouli: ఎస్ఎస్ రాజమౌళి పుట్టిన రోజు.. మహేష్ బాబు సినిమా టైటిల్ అదేనా? (video)

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

తర్వాతి కథనం
Show comments