Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా దాఖలు చేసిన మంత్రి కేటీఆర్

రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా దాఖలు చేసిన మంత్రి కేటీఆర్
విజయవాడ , సోమవారం, 20 సెప్టెంబరు 2021 (14:01 IST)
రాజకీయ దురుద్దేశంతో, అసత్యాలను అబద్దాలను ప్రచారం చేస్తున్నార‌ని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పై టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కె.తారకరామారావు సిటీ సివిల్ కోర్టు లో పరువు నష్టం కేసును  దాఖలు చేశారు. రేవంత్ రెడ్డి గత కొంత కాలంగా తనపైన అసత్య ప్రచారాన్ని చేస్తున్నారని, ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిర్వహిస్తున్న విచారణకు హాజరవుతున్న వ్యక్తులతో కానీ ఆయా కేసులతో కానీ తనకు ఎలాంటి సంబంధం లేకున్నా, రేవంత్ రెడ్డి దురుద్దేశ పూర్వకంగా తన పేరును వాడుకుంటున్నారని, దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేటీఆర్ కోర్టులో కేసు దాఖలు చేశారు.

ఇలాంటి దుష్ప్రచారం వల్ల కలిగిన పరువు నష్టానికి తగిన పరిహారం చెల్లించడంతో పాటు క్రిమినల్ ప్రొసీడింగ్స్ ని సైతం ప్రారంభించాలని కేటీఆర్ కోరారు.  గౌరవ న్యాయస్థానం తనపై రేవంత్ చేస్తున్న అసత్య ప్రచారాలను గుర్తించి, ఇలాంటి దురుద్దేశ కార్యక్రమాలకు పాల్పడుతున్న నిందితులను తగిన విధంగా శిక్షిస్తుందన్న విశ్వాసం తనకు ఉందని కేటీఆర్ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కంగ్రాట్స్ జ‌గ‌న్ సార్! వైసీసీ మంత్రుల విజ‌య గ‌ర్వం!