Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో కాల్పుల కలకలం - కారులో నుంచి పారిపోయిన అల్లుళ్లు

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (08:44 IST)
దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం సృష్టించాయి. గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఉత్తర ఢిల్లీలోని బారా హిందూరావ్‌ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ముజీబ్‌ అనే ప్రాపర్టీ డీలర్‌ ఈద్గా ప్రాంతంలో నివసిస్తుంటాడు. ఈయన మేనమామకు రాణి ఝాన్సీ రోడ్డులోని ఫిలిమిస్తాన్‌లో ఓ క్లినిక్‌ ఉంది. గురువారం రాత్రి వారు క్లినిక్‌‌కు తాళం వేసి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
 
క్లినిక్ షట్టర్‌కు తాళం వేసి వారిద్దరూ కారులో కూర్చోగానే.. ఓ యువకుడు వచ్చి వారి కారుకు అడ్డంగా నిల్చున్నాడు. అనంతరం మరో వ్యక్తి కూడా వచ్చాడు. జరగబోయే ప్రమాదాన్ని గుర్తించిన మామా అల్లుళ్లు కారులో నుంచి ప్రాణాలను అరచేతిలో పట్టుకుని పారిపోయారు. 
 
అయినప్పటికీ దుండుగులు వారిని వదిలిపెట్టలేదు. వారిపై కాల్పులు జరపారు. అయితే, ఆ సమంయలో అటుగా వెళ్తున్న వారికి ఆ బుల్లెట్లు తగలడంతో ఇద్దరు మరణించారని పోలీసులు తెలిపారు. 
 
మృతుల్లో ఒకరిని గుర్తించామని, మరొకరు ఎవరనే విషయం ఇంకా తెలియలేదని వెల్లడించారు. కాగా, ఐదు నుంచి ఆరుగురు ఈ కాల్పులకు తెగబడ్డారని, వారికోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments