Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకాశంలో విమానంలో చెలరేగిన మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

Webdunia
ఆదివారం, 19 జూన్ 2022 (15:05 IST)
స్పైస్ జెట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. గాల్లో ఉండగా ఈ విమానంలో నుంచి మంటలు చెలరేగాయి. పాట్నా విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ విమానంలో ఒక్కసారిగా మంటలు అంటుకోవడం కలకలం రేపింది. 
 
ఈ విమానం బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా నుంచి ఢిల్లీకి బయలుదేరింది. ఈ విమానం గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే ఒక్కసారిగా మంటలు అంటుకోవడం కలకలం రేపింది. పాట్నా విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ ఐన కొద్ది సేపటికే విమానం ఎడమ ఇంజిన్‌ను ఓ పక్షి ఢీకొట్టింది. 
 
దీంతో ఇంజిన్‌లో స్వల్పంగా మంటలు చెలరేగినట్లు ప్రయాణికులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన పైలట్లు.. విమానాన్ని తిరిగి పాట్నా విమానాశ్రయంలో అత్యవరసర ల్యాండింగ్‌ చేశారు. విమానం సురక్షితంగా ల్యాండ్‌ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
 
దీనిపై స్పందించిన డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ).. పక్షి ఢీ కొట్టడం వల్లే మంటలు వచ్చినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని గ్రహించిన వెంటనే ఇంజిన్‌ను ఆపేసిన పైలట్లు.. విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్‌ చేసినట్లు తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు (video)

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments