Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌ను వదలని కరోనా మహమ్మారి.. కొత్త రికార్డు.. 24 గంటల్లో 132 మంది మృతి

Webdunia
గురువారం, 21 మే 2020 (12:25 IST)
భారత్‌ను కరోనా ఇప్పట్లో వదిలేట్టు లేదు. చైనా నుంచి పుట్టుకొచ్చి, ప్రపంచ దేశాలకు అంటుకున్న కరోనా వైరస్ కారణంగా జనాలు నానా తంటాలు పడుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు లాక్ డౌన్ విధించిన తరుణలో భారత్‌లో కరోనా కల్లోలం కొనసాగుతోంది.
 
రోజురోజుకు కరోనా కేసులు సంఖ్య తగ్గడం లేదు. కానీ రోజుకో కొత్త రికార్డు తరహాలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. సడలింపులతో నాలుగో దశ లాక్‌డౌన్‌ కొనసాగుతున్న మహమ్మారి నియంత్రణలోకి రావడం లేదు. కరోనా యాక్టివ్ కేసుల విషయంలో ప్రపంచంలోనే ముందున్న ఐదు దేశాలలో భారతదేశం చేరింది.
 
ఇక, గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 5,609 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసిన కోరాని హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. మరోవైపు గత 24 గంటల్లో భారత్‌లో 132 మంది కరోనా బారినపడి మృతి చెందారు. దీంతో.. మృతుల సంఖ్య 3,435కు చేరింది.
 
దేశవ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,12,359కు చేరింది. ఇందులో ప్రస్తుతం 63,624కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.. 48,735 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రిల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments