భారత్‌ను వదలని కరోనా మహమ్మారి.. కొత్త రికార్డు.. 24 గంటల్లో 132 మంది మృతి

Webdunia
గురువారం, 21 మే 2020 (12:25 IST)
భారత్‌ను కరోనా ఇప్పట్లో వదిలేట్టు లేదు. చైనా నుంచి పుట్టుకొచ్చి, ప్రపంచ దేశాలకు అంటుకున్న కరోనా వైరస్ కారణంగా జనాలు నానా తంటాలు పడుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు లాక్ డౌన్ విధించిన తరుణలో భారత్‌లో కరోనా కల్లోలం కొనసాగుతోంది.
 
రోజురోజుకు కరోనా కేసులు సంఖ్య తగ్గడం లేదు. కానీ రోజుకో కొత్త రికార్డు తరహాలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. సడలింపులతో నాలుగో దశ లాక్‌డౌన్‌ కొనసాగుతున్న మహమ్మారి నియంత్రణలోకి రావడం లేదు. కరోనా యాక్టివ్ కేసుల విషయంలో ప్రపంచంలోనే ముందున్న ఐదు దేశాలలో భారతదేశం చేరింది.
 
ఇక, గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 5,609 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసిన కోరాని హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. మరోవైపు గత 24 గంటల్లో భారత్‌లో 132 మంది కరోనా బారినపడి మృతి చెందారు. దీంతో.. మృతుల సంఖ్య 3,435కు చేరింది.
 
దేశవ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,12,359కు చేరింది. ఇందులో ప్రస్తుతం 63,624కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.. 48,735 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రిల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Vishnu: ఒంగోలు నేపథ్యంలో శ్రీ విష్ణు, నయన్ సారిక జంటగా చిత్రం

Srikanth: ఇట్లు మీ వెధవ.. సినిమా చిత్ర బృందంపై శ్రీకాంత్ సెటైర్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments