Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌ను వదలని కరోనా మహమ్మారి.. కొత్త రికార్డు.. 24 గంటల్లో 132 మంది మృతి

Webdunia
గురువారం, 21 మే 2020 (12:25 IST)
భారత్‌ను కరోనా ఇప్పట్లో వదిలేట్టు లేదు. చైనా నుంచి పుట్టుకొచ్చి, ప్రపంచ దేశాలకు అంటుకున్న కరోనా వైరస్ కారణంగా జనాలు నానా తంటాలు పడుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు లాక్ డౌన్ విధించిన తరుణలో భారత్‌లో కరోనా కల్లోలం కొనసాగుతోంది.
 
రోజురోజుకు కరోనా కేసులు సంఖ్య తగ్గడం లేదు. కానీ రోజుకో కొత్త రికార్డు తరహాలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. సడలింపులతో నాలుగో దశ లాక్‌డౌన్‌ కొనసాగుతున్న మహమ్మారి నియంత్రణలోకి రావడం లేదు. కరోనా యాక్టివ్ కేసుల విషయంలో ప్రపంచంలోనే ముందున్న ఐదు దేశాలలో భారతదేశం చేరింది.
 
ఇక, గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 5,609 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసిన కోరాని హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. మరోవైపు గత 24 గంటల్లో భారత్‌లో 132 మంది కరోనా బారినపడి మృతి చెందారు. దీంతో.. మృతుల సంఖ్య 3,435కు చేరింది.
 
దేశవ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,12,359కు చేరింది. ఇందులో ప్రస్తుతం 63,624కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.. 48,735 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రిల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments