Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఆస్పత్రిలో అగ్నిప్రమాదం... 13 మంది మృత్యువాత

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (07:48 IST)
మహారాష్ట్ర పరిస్థితి రోజురోజుకూ మరింత దయనీయంగా మారిపోతోంది. ఈ రాష్ట్రంలో కరోనా వైరస్ దెబ్బకు అన్ని వ్యవస్థలూ కుప్పకూలిపోయాయి. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా నిలిచింది. దీంతో ఆస్పత్రులన్నీ ఫుల్ అయిపోయాయి. ఆక్సిజన్ నిల్వలు నిండుకున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితులను మహారాష్ట్ర ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఓ క‌రోనా ద‌వాఖాన‌లో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో 13 మంది క‌రోనా రోగులు అగ్నికి ఆహుత‌య్యారు. 
 
రాష్ట్రంలోని పాల్ఘ‌ర్ జిల్లా వాసాయిలో ఉన్న విజ‌య్ వ‌ల్ల‌భ్ ద‌వాఖాన‌లో కొవిడ్ రోగుల‌కు చికిత్స అందిస్తున్నారు. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున ద‌వాఖాన‌లోని ఐసీయూలో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో అందులో చికిత్స పొందుతున్న‌వారిలో 13 మంది స‌జీవ ద‌హ‌ణ‌మయ్యారు. 
 
స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది, పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు ప్రారంభించారు. ద‌వాఖాన‌లోని రోగుల‌ను స‌మీపంలోని హాస్పిటళ్ల‌కు త‌ర‌లించారు. ఫైర్ఇంజిన్ల స‌హాయంతో మంట‌ల‌ను ఆర్ప‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. మంట‌లు చెల‌రేగిన స‌మయంలో ఐసీయూలో 17 మంది రోగులు ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు ఇంకా తెలియ‌రాలేదు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments