Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యువతపై కరోనా పంజా... యువకుల్లో సగంమందికి పాజిటివ్

Advertiesment
Mangalagiri
, గురువారం, 22 ఏప్రియల్ 2021 (17:53 IST)
కరోనా రెండో దశ ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతోంది. గతంలో 50 ఏళ్ళు పై బడిన వారే ఎక్కువగా ఈ వైరస్ బారిన పడుతున్నట్లు వైద్యులు చెప్పారు. అయితే రెండో దశలో ఎక్కువగా యువకులే ఈ వైరస్ ధాటికి అల్లాడిపోతున్నట్లు రిపోర్ట్‌‌లు వెల్లడిస్తున్నాయి. 5 నుంచి 12 సంవత్సరాల లోపు పిల్లల్ని సైతం మహమ్మారి వదలడం లేదు.
 
మంగళగిరి పట్టణంలో బుధ, గురువారాల్లో 109 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 40 ఏళ్ల లోపు వారు 32 మంది ఉండగా, 30 ఏళ్ల లోపు వారు 16 మంది ఉన్నారు. 20 ఏళ్ల లోపు వారు 10 మంది, 10 ఏళ్ల లోపు వారు ముగ్గురు చొప్పున వైరస్ ప్రభావానికి గురయ్యారు.
 
మరణాల సంఖ్య కూడా పెరిగి పోతున్నా వివరాలు బయటకు రానివ్వటం లేదు. గతం కంటే పరిస్థితి భిన్నంగా ప్రమాదకరంగా మారింది. దీనిని బట్టి యువత అప్రమత్తంగా ఉంటూ సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తూ, కోవిడ్ నిబంధనలు పాటించాలి. నిర్లక్ష్యం వీడి మాస్కుల వాడకం భౌతిక దూరం పాటించటం విస్మరించకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
ప్రస్తుతం 45 ఏళ్ళు పైబడిన వారికే ప్రభుత్వం వ్యాక్సిన్ వేస్తుంది. మే ఒకటి నుండి 18 ఏళ్ళు నిండిన ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ వేస్తామని చెబుతున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉన్న ఈ నేపథ్యంలో సాధ్యమైనన్ని ఎక్కువ మందికి టెస్టులు జరిపి అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తే మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆక్సిజన్ నిల్వలు పుష్కలంగా ఉండేలా దృష్టిసారించాలి : నారా లోకేశ్