Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా నుంచి వెళ్లిపోతున్న కంపెనీలు, భారత్ వైపు చూపు

Webdunia
గురువారం, 7 మే 2020 (17:58 IST)
చైనా కారణంగా ప్రాణ నష్టం చవిచూసిన అనేక దేశాలు దానితో పొత్తును విరమించుకుంటున్నాయి. ముఖ్యంగా అమెరికా మరియు చైనా మధ్య ఇదివరకు సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇప్పుడు అసలుకే మోసం వచ్చింది. ట్రంప్ చైనా పేరెత్తితేనే తీవ్ర స్థాయిలో ఎగసి పడుతుండటం తెలిసిందే. చైనాలోని విదేశీ సంస్థలు, పరిశ్రమలను ఆయా దేశాలు స్వదేశానికి రప్పించుకోవడానికి వ్యూహాలు చేస్తున్నాయి. 
 
జపాన్ ఇప్పటికే దీనికోసం 2.2 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించింది. ఐరోపా దేశాలు కూడా చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చర్యలు ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పుడు చైనాలోని అమెరికా సంస్థలను భారత్‌కు రప్పించాలని మోదీ ప్రయత్నం చేస్తున్నారు. చైనా నుండి బయటకు వచ్చేసే ఉద్దేశంతో ఉన్న వెయ్యికి పైగా అమెరికా ఉత్పత్తి సంస్థలను భారత్ సంప్రదించింది. 
 
ఇన్సెంటివ్‌లను కూడా ఆఫర్ చేసింది. వైద్య పరికరాలు సరఫరా చేసే సంస్థలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, టెక్స్‌టైల్స్, లెదర్, ఆటో పార్ట్ తయారీ సంస్థలకు భారత్ ప్రాధాన్యం ఇస్తోందని సమాచారం. హెల్త్‌కేర్ ఉత్పత్తులు, పరికరాల సంస్థలు భారత్‌కు వచ్చే అవకాశం ఉందని మోదీ సర్కారు ఆశాభావం వ్యక్తం చేసింది. ఇప్పటికే మెడ్‌ట్రోనిక్, అబోట్ ల్యాబోరేటరీస్ లాంటి సంస్థలు తమ యూనిట్లను భారత్‌కు తరలించడం గురించి చర్చలు జరుపుతున్నాయి. 
 
ఈ సంస్థలు ఇప్పటికే భారత్‌ నుంచి కూడా కార్యకలాపాలు సాగిస్తుండటంతో ఉత్పత్తి యూనిట్‌లను చైనా నుండి భారత్‌కు తరలించడం కష్టం కాదని భావిస్తున్నారు. చైనా, జపాన్ వంటి దేశాలతో పోలిస్తే భారత్‌లో తక్కువ ధరకే భూమి లభిస్తుందని, నైపుణ్యం ఉన్న మానవ వనరులు కూడా ఇక్కడ అధికమని అధికారులు సంస్థలకు చెబుతున్నారు. 
 
అవసరమైతే కార్మిక చట్టాలను కూడా సవరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని కంపెనీలకు తెలిపారు. ఇప్పటికే చాలా సంస్థలు వియత్నాం వైపు మొగ్గు చూపాయి కానీ వియత్నాం, కాంబోడియా లాంటి దేశాలతో పోలిస్తే భారత్ మార్కెట్ పెద్దదనే విషయాన్ని కూడా నిపుణులు ప్రస్తావించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments