Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రెమిడీసివిర్ ట్రయల్స్ ప్రారంభం.. కానీ వ్యాక్సిన్‌పై డబ్ల్యూహెచ్ఓ ఏమందంటే?

రెమిడీసివిర్ ట్రయల్స్ ప్రారంభం.. కానీ వ్యాక్సిన్‌పై డబ్ల్యూహెచ్ఓ ఏమందంటే?
, మంగళవారం, 5 మే 2020 (17:36 IST)
గిలీడ్ ఫార్మా సంస్థ ఇటీవలే రెమిడీసివిర్ అనే మెడిసిన్‌ను కరోనా రోగులపై ప్రయోగించింది. కానీ ఫస్ట్ ట్రయల్‌లో ఈ మెడిసిన్ ఫెయిల్ అయింది. తాజాగా కొంత మేర అది మంచి ఫలితాలను సాధించినట్టు తెలుస్తోంది. 
 
ఇటీవల కరోనా రోగులకు ఈ మెడిసిన్‌ను వాడవచ్చని అమెరికా ఆమోదం కూడా తెలిపింది. తొలి విడతగా 1.5 మిలియన్ డ్రగ్ డోస్‌ను తయారు చేస్తున్నారు. ఈ డ్రగ్ పరిశోధనలో ఇండియన్ అమెరికన్ శాస్త్రవేత్తలు కూడా భాగస్వాములు అయ్యారు.
 
తాజాగా భారత్‌లో కూడా రెమిడీసివిర్ మెడిసిన్‌ను ట్రయల్స్ గా వినియోగించనున్నారు. దీని కోసం 1000 డోసులు సిద్ధం చేశారు. త్వరలోనే వీటిని కరోనా రోగులకు ఇవ్వబోతున్నారు. ఈ ట్రయల్స్ ఫలితాలను ఇస్తే.. భారత్‌లో కూడా వీటిని కమర్షియల్‌గా తయారు చేసే అవకాశం ఉంది.
 
అయితే డబ్ల్యూహెచ్ఓ కొవిడ్-19 ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ డేవిడ్ నబర్రో మాత్రం కరోనా వ్యాక్సిన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనాకు వ్యాక్సిన్ ఎప్పటికీ రాకపోవచ్చునని తెలిపారు. చాలారకాల వైరస్‌లకు ఇప్పటికీ వ్యాక్సిన్ లేదని, కరోనా విషయంలోనూ అదే జరుగుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. 
 
కరోనా వైరస్‌ను నిలువరించే వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు దాదాపు లేవని నబర్రో స్పష్టం చేశారు. జరుగుతున్న ప్రయోగాల కారణంగా ప్రజల్లో ఆశలు రేకెత్తుతున్నా, చప్పున చల్లారిపోతున్నాయని, అంతిమంగా అన్నీ ఈ వైరస్ ముందు దిగదుడుపేనని డాక్టర్ నబర్రో చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'అమ్మ ఒడి పథకం' డబ్బులు - 'నాన్న గొంతు తడి'కే ఖర్చయిపోతున్నాయ్...