Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలుడిని బందీ చేశారు.. ఆపై ముఖంపై మూత్ర విసర్జన

Webdunia
మంగళవారం, 28 నవంబరు 2023 (13:32 IST)
ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. నవంబర్ 13న బంధువుల ఇంటికి వెళ్తున్న బాలునిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆ బాలుడ్ని కిడ్నాప్ చేసి బందీ చేశారు. అనంతరం జాగృతి విహార్‌లోని నిర్జన రహదారిపైకి తీసుకెళ్లి దాడి చేశారు. 
 
అంతటితో ఆగని నిందితులు ఆ బాలుడి ముఖంపై మూత్ర విసర్జన చేశారు. మరోవైపు ఆ బాలుడు అదృశ్యం కావడంతో అతని కుటుంబ సభ్యులు రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టారు. 
 
మరుసటి రోజు ఉదయం ఎలాగోలా ఆ బాలుడు వారి నుంచి తప్పించుకుని ఇంటికి  వచ్చి కుటుంబ సభ్యులకు విషయం తెలిపాడు. కానీ యూరినేషన్ ఘటనను మాత్రం బయటకు వెల్లడించలేదు. తాజాగా బాలునిపై మూత్రం పోసిన దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో విషయం బయటకు వచ్చింది. 
 
వీడియో బయటకు వచ్చిన తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు.. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపులు చేపట్టారు.
 
ఇప్పటివరకు నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. బాలురు గొడవ పడటానికి గల కారణాలు మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు. ఈ కేసులో బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments