Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొచ్చిన్ వర్శిటీలో టెక్ ఫెస్ట్.. తొక్కిసలాట.. వర్షమే కొంపముంచింది..

కొచ్చిన్ వర్శిటీలో టెక్ ఫెస్ట్.. తొక్కిసలాట.. వర్షమే కొంపముంచింది..
, సోమవారం, 27 నవంబరు 2023 (22:18 IST)
కోహిలోని ఓ యూనివర్సిటీలో జరిగిన తొక్కిసలాటలో నలుగురు విద్యార్థులు, మరో 64 మందికి పైగా గాయపడ్డారు. శనివారం కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CUSAT) క్యాంపస్‌లోని ఓపెన్-ఎయిర్ ఆడిటోరియంలో టెక్ ఫెస్ట్‌లో ప్రముఖ గాయని నికితా గాంధీ ప్రదర్శన జరిగింది.

ఈ సందర్భంగా గాయపడిన వారిలో నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. పాస్‌లు కలిగివున్న వారు మాత్రమే ఈ షోకు అనుమతించబడ్డారు. కానీ బయట వర్షం పడటం ప్రారంభించిన తర్వాత ప్రజలు ఆడిటోరియంలోకి పరుగులు తీయడం ప్రారంభించారు. దీంతో తొక్కిసలాట జరిగి కొందరు విద్యార్థులు జారి పడిపోయారు. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఈ ఘటనపై సింగర్ నికితా గాంధీ ఇలా రాశారు, 'ఈ సాయంత్రం కొచ్చిలో జరిగిన దానితో గుండె పగిలింది నేను ప్రదర్శన కోసం వేదికకు బయలుదేరేలోపే అలాంటి దురదృష్టకర సంఘటన జరిగింది. ఈ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేయడానికి పదాలు సరిపోవన్నారు. 
 
ఈ వార్త చాలా దురదృష్టకరమని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. గాయపడిన 46 మందిని కలమసేరి మెడికల్ కాలేజీకి తరలించారు. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిలో ఇద్దరు ప్రైవేటు ఆసుపత్రిలో, మరో ఇద్దరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అధికారంలోకి వస్తే హైదరాబాదును భాగ్యనగర్‌గా మారుస్తాం.. కిషన్ రెడ్డి