Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బు పంపిణీలో వివాదం.. ప్రియుడిని చంపేసిన ప్రియురాలు...

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (09:36 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. డబ్బు పంపకంలో ఏర్పడిన వివాదం కారణంగా తన ప్రియుడిని ఓ ప్రియురాలు చంపేసింది. ఆ తర్వాత శవాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో పెట్టి అడవిలోకి తీసుకెళ్లి తగులబెట్టింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాజ్‌నంద్‌గావ్‌కు చెందిన చంద్రభూషణ్ అనే వ్యక్తి కనిపించడం లేదంటూ ఆయన కుటుంబ సభ్యులు మూడు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కోట్నా పానీ అడవుల్లో రెండు రోజుల క్రితం సగం కాలిన మృతదేహాన్ని స్థానికులు గుర్తించినట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. 
 
దీంతో పోలీసుల ఘటనా స్థలానికి వెళ్లి ఆ సగం కాలిన మృతదేహాన్ని చంద్రభూషణ్‌గా వారి కుటుంబ సభ్యుల సహకారంతో గుర్తించారు. ఆ తర్వాత చంద్రభూషణ్ ప్రియురాలు రాగిణి సాహును అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం వెల్లడించింది. 
 
తన వద్ద అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వక పోవడంతో తమ ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని, పలుమార్లు తనను బ్లాక్ మెయిల్ చేస్తూ వేధించడంతో నూతన సాహు అనే స్నేహితుడితో కలిసి హత్య చేసినట్టు వెల్లడించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి రాగిణి సాహును అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments