నోట్లో బల్లిపడి రెండున్నరేళ్ల బాలుడు మృతి.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 25 జులై 2023 (09:31 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కోర్బాలో ఓ విషాదకర ఘటన జరిగింది. నోట్లో బల్లిపడి రెండున్నరేళ్ల బాలుడు మృత్యువాతపడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, నాగిన్ బంఠా అనే గ్రామానికి చెందిన రాజ్ కుమార్‌కు ముగ్గురు పిల్లలు ఉండగా, వీరిలో ఆఖరి బాలుడి వయసు రెండున్నరేళ్లు. సోమవారం ఉదయం 8 గంటల సమయంలో ఇంట్లోని మంచంపై పడుకునివున్నాడు. ఆ సమయంలో అతని తల్లి ఇంట్లోవుండి తన పనుల్లో నిమగ్నమైంది. 
 
ఈ క్రమంలో పిల్లాడి నుంచి ఎలాంటి శబ్దం వినిపించకపోవడంతో అతని వద్దకు వచ్చి చూడగా, అతని నోట్లో బల్లి కనిపించింది. దీంతో ఆందోళనకు గురైన తల్లి పెద్దగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు అక్కడకు వచ్చి చూడగా, బాలుడిని నోట్లో బల్లిపడివున్నట్టు గుర్తించారు. బలి విషం కారణంగానే పిల్లోడు ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు వాపోతున్నారు. 
 
అయితే, జంతుశాస్త్ర నిపుణుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ బలరాం కుర్రే మాట్లాడుతూ, 'బల్లి విషం వల్ల బాలుడు మరణించే అవకాశం లేదు. బల్లి నోట్లో పడడం వల్ల శ్వాశ ఆడక చనిపోయే అవకాశం ఉంది. బాలుడి మరణానికి గల అసలు కారణం తెలియాలంటే పోస్టుమార్టం పరీక్షల ఫలితాలు వస్తేనే తెలుస్తుంది' అని అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments