Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను - మేనల్లుడిని తుపాకీతో కాల్చి చంపేసిన పోలీస్ అధికారి

Webdunia
మంగళవారం, 25 జులై 2023 (09:11 IST)
మహారాష్ట్రలోని పూణెలో ఓ దారుణ ఘటన జరిగింది. ఓ సీనియర్ పోలీస్ అధికారి కట్టుకున్న భార్యతో పాటు మేనల్లుడిని తుపాకీతో కాల్చి చంపేశాడు. ఆపై సర్వీస్ రివాల్వర్‌తో తాను కూడా కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మహారాష్ట్రలోని అమరావతి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ భరత్ గైక్వాడ్ (57) బానర్ ప్రాంతంలో కుటుంబంతో నివసిస్తున్నాడు. ఈయన సోమవారం విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్నాడు. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అధికారి తన తుపాకీతో మొదట తన భార్య మోని గైక్వాడ్ (44)ను తుపాకీతో తలపై కాల్చాడు. 
 
దీంతో ఒక్కసారిగా తుపాకీ శబ్దం వినిపించడంతో పక్క గదిలో ఉన్న కుమారుడు, మేనల్లుడు పరుగున అక్కడకు వచ్చాడు. తలుపు తెరిచిన మేనల్లుడు దీపక్ (35) పైనా కాల్పులు జరిపాడు. ఛాతీపై బులెట్ తగలడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం తాను తుపాకీతో కాల్చుకుని ఆ పోలీసు అధికారి మరణించాడు. ఈ ఘటనకు గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments