Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంకా ఎన్ని లీటర్ల రక్తం చిందాలి.. ఫ్లెక్సీలు లేకుంటే పెళ్లిళ్లు జరగవా?

Webdunia
శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (14:56 IST)
చెన్నై నగర శివారు ప్రాంతమైన పళ్లికరణిలో ఓ ఫ్లెక్సీ కూలి బీటెక్ యువతి దుర్మరణం పాలైన కేసుపై మద్రాసు హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇంకా ఎన్ని లీటర్ల రక్తం చిందాలనుకుంటున్నారని తమిళనాడు ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. పైగా, గతంలో తాము జారీ చేసిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని నిలదీసింది. 
 
పళ్లికరణి రహదారి డివైడర్‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పడి శుభశ్రీ (22) అనే బీటెక్ యువతి మృతి చెందిన విషయం తెల్సిందే. ఈ ఘటనపై హైకోర్టు సీరియస్ అయింది. ఇంకా ఎన్ని లీటర్ల రక్తం చిందాలనుకుంటున్నారని తమిళనాడు ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది. అక్రమ హోర్డింగ్స్ ఏర్పాటుపై గతంలోనే ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని కోర్టు సీరియస్ అయింది. తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదని కోర్టు నిదీసింది.
 
తమిళనాడులో ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే నిర్లక్ష్యమా అని హైకోర్టు ప్రశ్నించింది. ఫ్లెక్సీలు లేకుండా నేతల పెళ్లిళ్లు జరగవా అంటూ న్యాయమూర్తి మండిపడ్డారు. పైగా, చెన్నై బీచ్‌లో ఉన్న అన్ని రాజకీయ బ్యానర్లను తొలగించాలని ఆదేశించారు. ప్రజల ప్రాణాలంటే అధికారులకు లెక్కలేదా? అని కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారని మద్రాస్‌ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments