Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో దారుణం-డబ్బు కోసం కరోనా రోగిని హత్య చేసింది.. ఎవరు..?

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (18:16 IST)
corona patient murder
కరోనా రోగుల పట్ల వైద్యులు విశ్వప్రయత్నాలు చేసి కాపాడుతున్నారు. వారి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ కొన్ని చోట్ల కరోనా పేషెంట్లు నరకయాతన అనుభవిస్తున్నారు. చాలీచాలని వైద్య సదుపాయాలతో ఇబ్బందులకు గురవుతున్నారు. అదే ప్రభుత్వ ఆస్పత్రుల్లో అయితే దారుణం. కరోనా రోగుల పట్ల వైద్య సిబ్బంది నీచంగా ప్రవర్తిస్తున్నారు. 
 
అయితే చెన్నైలో ఓ రోగి హత్యకు గురైంది. డబ్బుల కోసం కరోనా రోగిని హతమార్చిన ఘటన చెన్నై ప్రభుత్వ ఆసుప్రతిలో చోటుచేసుకుంది. కరోనా సోకి చికిత్స పొందటానికి వచ్చిన ఓ రోగిని ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉగ్యోగిగా పనిచేస్తున్న ఓ మహిళ చంపేసింది. కేవలం డబ్బుల కోసమే కరోనా రోగిని హత్య చేసినట్లుగా తెలిసింది. వివరాల్లోకి వెళితే.. సునీత అనే కరోనా బాధితురాలు చెన్నైలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్లో చేరింది.
 
ఆ సెంటర్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగినిగా పనిచేస్తున్న రతీదేవి అనే మహిళ సునీతను హత్య చేసింది. గత నెల 23న జరిగిన ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు నిందితురాలిని పట్టుకున్నారు. సునీత దగ్గర ఉన్న డబ్బులు, సెల్ ఫోన్ కోసం సునీతను రతీదేవి హత్య చేసింది.
 
చికిత్స పొందుతుండగా కూడా మెరుగైన ఆరోగ్యంతో భార్య సడెన్ గా చనిపోయిందని తెలిసిన సునీత భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా రతీదేవి సునీత దగ్గర ఉన్న డబ్బులు, సెల్ ఫోన్ కోసం ఆమెను హత్య చేసిందని తేలింది. మే 23న జరిగిన ఈ హత్యను పోలీసులు ఛేధించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments