Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో దారుణం-డబ్బు కోసం కరోనా రోగిని హత్య చేసింది.. ఎవరు..?

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (18:16 IST)
corona patient murder
కరోనా రోగుల పట్ల వైద్యులు విశ్వప్రయత్నాలు చేసి కాపాడుతున్నారు. వారి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ కొన్ని చోట్ల కరోనా పేషెంట్లు నరకయాతన అనుభవిస్తున్నారు. చాలీచాలని వైద్య సదుపాయాలతో ఇబ్బందులకు గురవుతున్నారు. అదే ప్రభుత్వ ఆస్పత్రుల్లో అయితే దారుణం. కరోనా రోగుల పట్ల వైద్య సిబ్బంది నీచంగా ప్రవర్తిస్తున్నారు. 
 
అయితే చెన్నైలో ఓ రోగి హత్యకు గురైంది. డబ్బుల కోసం కరోనా రోగిని హతమార్చిన ఘటన చెన్నై ప్రభుత్వ ఆసుప్రతిలో చోటుచేసుకుంది. కరోనా సోకి చికిత్స పొందటానికి వచ్చిన ఓ రోగిని ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉగ్యోగిగా పనిచేస్తున్న ఓ మహిళ చంపేసింది. కేవలం డబ్బుల కోసమే కరోనా రోగిని హత్య చేసినట్లుగా తెలిసింది. వివరాల్లోకి వెళితే.. సునీత అనే కరోనా బాధితురాలు చెన్నైలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్లో చేరింది.
 
ఆ సెంటర్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగినిగా పనిచేస్తున్న రతీదేవి అనే మహిళ సునీతను హత్య చేసింది. గత నెల 23న జరిగిన ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు నిందితురాలిని పట్టుకున్నారు. సునీత దగ్గర ఉన్న డబ్బులు, సెల్ ఫోన్ కోసం సునీతను రతీదేవి హత్య చేసింది.
 
చికిత్స పొందుతుండగా కూడా మెరుగైన ఆరోగ్యంతో భార్య సడెన్ గా చనిపోయిందని తెలిసిన సునీత భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా రతీదేవి సునీత దగ్గర ఉన్న డబ్బులు, సెల్ ఫోన్ కోసం ఆమెను హత్య చేసిందని తేలింది. మే 23న జరిగిన ఈ హత్యను పోలీసులు ఛేధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments