Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. రూ.350 తగ్గిన పసిడి ధర

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. రూ.350 తగ్గిన పసిడి ధర
, సోమవారం, 14 జూన్ 2021 (10:02 IST)
బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో సోమవారం భారీ మార్పులు చోటుచేసుకున్నాయి.  బంగారం ధ‌ర‌లు భారీగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.350 తగ్గి రూ.45,740కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.410 తగ్గి రూ.49,890కి చేరిది.  
 
చాలా రోజుల త‌రువా 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.50 వేల దిగువ‌కు చేరింది.  దేశీయంగా మార్కెట్లు తిరిగి క్ర‌మంగా పుంజుకోవ‌డంతో బంగారం ధ‌ర‌లు తగ్గుముఖం ప‌డుతున్నాయి. అటు అంత‌ర్జాతీయంగా కూడా బంగారం ధ‌ర‌లు కొంత‌మేర తగ్గ‌డంతో ఆ ప్ర‌భావం దేశీయ మార్కెట్ల‌పై ప‌డింది. ఇక బంగారం ధ‌ర‌లు త‌గ్గినప్ప‌టికీ వెండి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పులు ఉండ‌టం లేదు. కిలో బంగారం ధ‌ర రూ. 77,300 వ‌ద్ద స్థిరంగా ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దంచికొట్టిన వర్షం ... ఆ జిల్లాలో 13 సెం.మీ వర్షంపాతం