Webdunia - Bharat's app for daily news and videos

Install App

చార్‌ధామ్ యాత్ర ప్రారంభం - తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయ తలుపులు

ఠాగూర్
శుక్రవారం, 2 మే 2025 (10:42 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దేవభూమిగా భాసిల్లే పుణ్యభూమి కేదార్‌నాథ్ ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్‌నాథుడుని దర్శనం చేసుకునేందుకు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఇక్కడకు తరలివస్తుంటారు. భారీ మంచు కారణంగా సుధీర్ఘకాలం మూసివుండే ఈ పుణ్యక్షేత్రం శుక్రవారం తెరుచుకుంది. శుక్రవారం ఉదయం 7 గంటలకు వేద మంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు ఆలయం తలుపులు తెరిచారు. ఈ సందర్భంగా భక్తులపై హెలికాఫ్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు. తలుపులు తెరుచుకోనున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణాన్ని పూలతో అందంగా అలంకరించారు. ఇందుకోసం 13 టన్నుల పూలను వినియోగించారు. 
 
కేదార్‌నాథ్ తలుపులు తెరుచుకోవడంతో చార్‌ధామ్ యాత్ర సీజన్ ప్రారంభమైనట్టయింది. యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను చార్‌ధామ్ క్షేత్రాలుగా పిలుస్తారు. యమునోత్రి, గంగోత్రి ధామాలు ఏప్రిల్ 30వ తేదీన అక్షయ తృతీయ రోజున తెరవగా, బద్రీనాథ్ ఆలయాన్ని మాత్రం ఈ నెల 4వ తేదీన తెరుస్తారు. కేదార్‌నాథ్ ఆలయం మాత్రం శుక్రవారం తెరుచుకుంది. 
 
మరోవైపు, ఇటీవల పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ చార్‌ధామ్ యాత్ర కొనసాగే మార్గంలో పోలీసులు, భద్రతా బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని భక్తులకు అధికారులు విజ్ఞప్తి చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments