Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నబిడ్డను చంపేసి ప్రియుడితో లేచిపోయిన తల్లి

Webdunia
మంగళవారం, 28 జనవరి 2020 (12:36 IST)
ఆ కసాయి తల్లికి కన్నబిడ్డ కంటే ప్రియుడే ఎక్కువైపోయాడు. ప్రియుడుతో పడకసుఖాన్ని పంచుకునేందుకు పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను చంపేసి.. ఆ తర్వాత ప్రియుడుతో పారిపోయింది. ఈ దారుణం ఛండీఘర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఛండీఘర్‌కు సమీపంలోని బురాలి గ్రామానికి చెందిన దశరథ్‌ అనే వ్యక్తి భార్య, రెండున్నరేళ్ళ కుమారుడు ఉన్నాడు. దశరథ్‌ వృత్తి రీత్యా ఎలక్ట్రిషీయన్‌. అయితే ఆయన భార్యకు మరో వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. 
 
ఈ క్రమంలో ఆదివారం ఉదయం బాలుడిని తన ఇంట్లో బెడ్‌ బాక్స్‌లో కుక్కింది. అరవకుండా ఉండేందుకు బాలుడి నోట్లో బట్ట ముక్క కుక్కి.. తన ప్రియుడితో లేచిపోయింది. సాయంత్రం ఇంటికొచ్చిన దశరథ్‌ తన భార్య, కుమారుడి కోసం గాలించాడు. 
 
తొలుత బంధువుల ఇంటికెళ్లి ఉండొచ్చు అని దశరథ్‌ భావించాడు. కానీ బంధువుల ఇంటికి వారు వెళ్లలేదు. దీంతో భార్యకు ఫోన్‌ చేయగా.. బాలుడిని బెడ్‌ బాక్స్‌లో ఉంచినట్లు చెప్పింది. బెడ్‌ బాక్స్‌ను తెరిచి చూడగా పిల్లాడు ప్రాణాలు కోల్పోయి ఉన్నాడు. దశరథ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆమె ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments