Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నబిడ్డను చంపేసి ప్రియుడితో లేచిపోయిన తల్లి

Webdunia
మంగళవారం, 28 జనవరి 2020 (12:36 IST)
ఆ కసాయి తల్లికి కన్నబిడ్డ కంటే ప్రియుడే ఎక్కువైపోయాడు. ప్రియుడుతో పడకసుఖాన్ని పంచుకునేందుకు పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను చంపేసి.. ఆ తర్వాత ప్రియుడుతో పారిపోయింది. ఈ దారుణం ఛండీఘర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఛండీఘర్‌కు సమీపంలోని బురాలి గ్రామానికి చెందిన దశరథ్‌ అనే వ్యక్తి భార్య, రెండున్నరేళ్ళ కుమారుడు ఉన్నాడు. దశరథ్‌ వృత్తి రీత్యా ఎలక్ట్రిషీయన్‌. అయితే ఆయన భార్యకు మరో వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. 
 
ఈ క్రమంలో ఆదివారం ఉదయం బాలుడిని తన ఇంట్లో బెడ్‌ బాక్స్‌లో కుక్కింది. అరవకుండా ఉండేందుకు బాలుడి నోట్లో బట్ట ముక్క కుక్కి.. తన ప్రియుడితో లేచిపోయింది. సాయంత్రం ఇంటికొచ్చిన దశరథ్‌ తన భార్య, కుమారుడి కోసం గాలించాడు. 
 
తొలుత బంధువుల ఇంటికెళ్లి ఉండొచ్చు అని దశరథ్‌ భావించాడు. కానీ బంధువుల ఇంటికి వారు వెళ్లలేదు. దీంతో భార్యకు ఫోన్‌ చేయగా.. బాలుడిని బెడ్‌ బాక్స్‌లో ఉంచినట్లు చెప్పింది. బెడ్‌ బాక్స్‌ను తెరిచి చూడగా పిల్లాడు ప్రాణాలు కోల్పోయి ఉన్నాడు. దశరథ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆమె ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments