భారత్ జోడో యాత్ర : రాహుల్ గాంధీపై కేసు నమోదు

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (09:41 IST)
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. ఆయన గత కొన్న రోజులుగా భారత్ జోడో యాత్ర చేస్తున్నారు. ఈ యాత్ర తమిళనాడు రాష్ట్రంలోని కన్నియాకుమారి నుంచి ప్రారంభమై కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పూర్తి చేసుకుని తెలంగాణాలో కొనసాగుతోంది. అయితే, రాహుల్ గాంధీ ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. 
 
పాదయాత్రలో "కేజీఎఫ్-2" చిత్రంలోని పాటలను వినియోగించారంటూ రాహుల్‌తో పాటు మరికొందరిపై కేసు నమోదైంది. 'కేజీఎఫ్-2' పాటలపై హక్కులను కలిగివున్న బెంగుళూరుకు చెందిన ఎమ్మార్టీ మ్యూజిక్ అనే మ్యూజిక్ ఫ్లాట్‌ఫాం పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో రాహుల్ గాంధీ, జైరాం రమేష్, సుప్రియా శ్రీనటేలపై కాపీరైట్ ఉల్లంఘనల చట్టం కింద కేసు నమోదు చేశారు. 
 
ఈ చిత్రంలోని హిందీ వెర్షన్ పాటలపై హక్కులను సొంతం చేసుకునందుకు తాము భారీ మొత్తంలో చెల్లించామని, అయితే, కాంగ్రెస్ పార్టీ నేతలు తమ అనుమతి లేకుడా ఈ పాటలను వాడుకుంటున్నారని, తమ పాటల బ్యాక్‌గ్రౌండ్‌తో వీడియోలు రూపొందిస్తున్నారంటూ ఎమ్మార్టీ మ్యూజిక్ కంపెనీ చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

Shobitha Dhulipala: క్లౌడ్ కిచెన్ గురించి పోస్ట్ పెట్టి శోభితను పడేసిన నాగచైతన్య

Shilpa Shetty: నటి శిల్పా శెట్టి పై ముంబై పోలీసులు దర్యాప్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments