Webdunia - Bharat's app for daily news and videos

Install App

నదిలో చిక్కుకున్న బస్సు- 36మంది ప్రయాణీకులు ఏమయ్యారు?

Webdunia
శనివారం, 22 జులై 2023 (15:03 IST)
Bus
దేశంలో రుతుపవనాలు పూర్తి స్వింగ్‌లో వున్నాయి. దీంతో అనేక ప్రాంతాలలో వర్షాలు, భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా యూపీ, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో నీటి ఎద్దడి లాంటి పరిస్థితి నెలకొంది. అలాంటి ప్రాంతంలో ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లా బస్సు నదిలో చిక్కుకుపోయింది. 
 
36 మంది ప్రయాణికులతో వెళ్తున్న రోడ్డు మార్గం బస్సు మండవాలి జిల్లా పరిధిలోకి వచ్చే బిజ్నోర్‌లోని కోట వాలి నదిలో చిక్కుకుంది. బస్సులో ఇరుక్కున్న ప్రయాణికులు దాదాపు మూడు గంటల పాటు నరకం అనుభవించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
 
అక్కడ బస్సులో చిక్కుకున్న ప్రయాణికుల అరుపులు వినిపిస్తున్నాయి. ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. నది ప్రవాహానికి బస్సు కొట్టుకుపోకుండా జేసీబీతో బస్సును స్థిరంగా ఉంచేందుకు కృషి చేస్తున్నారు. 
 
అధికారుల నుంచి అందిన సమాచారం ప్రకారం బస్సులో మూడు డజన్ల మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు బోల్తా పడకుండా అన్ని ప్రయత్నాలు చేశారు. 
 
బస్సు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులను బయటకు తీసే పని ప్రారంభించారు. చివరికి బిజ్నోర్‌లోని కొత్వాలి నదిలో ఇరుక్కున్న ఈ బస్సు నుండి ప్రయాణికులందరినీ సురక్షితంగా తరలించినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments