Webdunia - Bharat's app for daily news and videos

Install App

నదిలో చిక్కుకున్న బస్సు- 36మంది ప్రయాణీకులు ఏమయ్యారు?

Webdunia
శనివారం, 22 జులై 2023 (15:03 IST)
Bus
దేశంలో రుతుపవనాలు పూర్తి స్వింగ్‌లో వున్నాయి. దీంతో అనేక ప్రాంతాలలో వర్షాలు, భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా యూపీ, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో నీటి ఎద్దడి లాంటి పరిస్థితి నెలకొంది. అలాంటి ప్రాంతంలో ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లా బస్సు నదిలో చిక్కుకుపోయింది. 
 
36 మంది ప్రయాణికులతో వెళ్తున్న రోడ్డు మార్గం బస్సు మండవాలి జిల్లా పరిధిలోకి వచ్చే బిజ్నోర్‌లోని కోట వాలి నదిలో చిక్కుకుంది. బస్సులో ఇరుక్కున్న ప్రయాణికులు దాదాపు మూడు గంటల పాటు నరకం అనుభవించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
 
అక్కడ బస్సులో చిక్కుకున్న ప్రయాణికుల అరుపులు వినిపిస్తున్నాయి. ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. నది ప్రవాహానికి బస్సు కొట్టుకుపోకుండా జేసీబీతో బస్సును స్థిరంగా ఉంచేందుకు కృషి చేస్తున్నారు. 
 
అధికారుల నుంచి అందిన సమాచారం ప్రకారం బస్సులో మూడు డజన్ల మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు బోల్తా పడకుండా అన్ని ప్రయత్నాలు చేశారు. 
 
బస్సు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులను బయటకు తీసే పని ప్రారంభించారు. చివరికి బిజ్నోర్‌లోని కొత్వాలి నదిలో ఇరుక్కున్న ఈ బస్సు నుండి ప్రయాణికులందరినీ సురక్షితంగా తరలించినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిజమైన భారతీయుడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్: ఎస్.జె సూర్య (Video)

రూ.1,000 కోట్ల క్లబ్‌కు చేరువలో ప్రభాస్ "కల్కి 2898 AD"

పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలోనా.. పేరెంట్స్ అలెర్ట్: సాయి ధరమ్ తేజ్

ప్రభాస్‌కు పెళ్లి చేయాలని మాకూ వుంది.. కానీ టైం రావాలి: శ్యామలాదేవి

రాజ్ తరుణ్‌తో నాకెలాంటి సంబంధం లేదు.. హీరోయిన్ మాల్వి మల్హోత్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments