Webdunia - Bharat's app for daily news and videos

Install App

నదిలో చిక్కుకున్న బస్సు- 36మంది ప్రయాణీకులు ఏమయ్యారు?

Webdunia
శనివారం, 22 జులై 2023 (15:03 IST)
Bus
దేశంలో రుతుపవనాలు పూర్తి స్వింగ్‌లో వున్నాయి. దీంతో అనేక ప్రాంతాలలో వర్షాలు, భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా యూపీ, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో నీటి ఎద్దడి లాంటి పరిస్థితి నెలకొంది. అలాంటి ప్రాంతంలో ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లా బస్సు నదిలో చిక్కుకుపోయింది. 
 
36 మంది ప్రయాణికులతో వెళ్తున్న రోడ్డు మార్గం బస్సు మండవాలి జిల్లా పరిధిలోకి వచ్చే బిజ్నోర్‌లోని కోట వాలి నదిలో చిక్కుకుంది. బస్సులో ఇరుక్కున్న ప్రయాణికులు దాదాపు మూడు గంటల పాటు నరకం అనుభవించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
 
అక్కడ బస్సులో చిక్కుకున్న ప్రయాణికుల అరుపులు వినిపిస్తున్నాయి. ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. నది ప్రవాహానికి బస్సు కొట్టుకుపోకుండా జేసీబీతో బస్సును స్థిరంగా ఉంచేందుకు కృషి చేస్తున్నారు. 
 
అధికారుల నుంచి అందిన సమాచారం ప్రకారం బస్సులో మూడు డజన్ల మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు బోల్తా పడకుండా అన్ని ప్రయత్నాలు చేశారు. 
 
బస్సు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులను బయటకు తీసే పని ప్రారంభించారు. చివరికి బిజ్నోర్‌లోని కొత్వాలి నదిలో ఇరుక్కున్న ఈ బస్సు నుండి ప్రయాణికులందరినీ సురక్షితంగా తరలించినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments