Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెల్లెమ్మకు స్మార్ట్ ఫోన్ తీసిచ్చాడు.. వీడియోలు చూస్తుందని చంపేశాడు..

Webdunia
గురువారం, 1 జులై 2021 (23:05 IST)
అన్నయ్య చెల్లెమ్మకు ప్రేమగా స్మార్ట్ ఫోన్ తీసిచ్చాడు. కానీ అదే చెల్లెలి ప్రాణాలు తీసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా వాసవంపురంలో దారుణం జరిగింది. ఫోన్‌లో అదేపనిగా వీడియోలు చూస్తోందని చెల్లిని కత్తితో పొడిచి చంపాడు అన్నయ్య.

సుడలై అనే వ్యక్తి తూత్తుకుడి జిల్లాలోని వల్లనాడు సమీపంలోని వాసవంపురంలో నివాసం ఉంటున్నాడు. రైతు అయిన సుడలైకి కొడుకు మలైరాజా(20), కూతురు కవిత(17) ఉన్నారు. 
 
కవిత ప్లస్ టూ చదువుతోంది. కాగా, మలైరాజా తన చెల్లి కవితకు ఆన్‌లైన్‌ క్లాసుల కోసం సెల్‌ఫోన్‌ కొనిచ్చాడు. అయితే కవిత క్లాసులు వినకుండా.. సెల్‌పోన్‌లో వీడియోలు చూడటం మొదలుపెట్టింది. ఈ విషయమై మలైరాజా పలుమార్లు చెల్లిని హెచ్చరించాడు. అయినా కవిత పట్టించుకోలేదు. 
 
ప్రతి రోజు దీనిపై ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఎంత చెప్పినా వినకుండా వీడియోలు చూస్తోందని కోపానికి లోనైన మలైరాజా.. కవితను వెనుక నుంచి కత్తితో పొడిచాడు. తీవ్రగాయాలపాలైన కవిత మృతి చెందింది. ఆ తర్వాత మలైరాజా అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. వల్లానాడు సమీపంలో రాజాను పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments