Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెల్లవారితే పెళ్లి.. ఇంతలోనే వరుడిని కరోనా పొట్టనబెట్టుకుంది.. ఎక్కడ?

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2020 (19:27 IST)
కరోనా వైరస్ అన్నీ వర్గాల ప్రజలను ఆవహిస్తోంది. పేద ధనిక వర్గాలనే తేడా లేకుండా కరోనా సోకుతోంది. ఫలితంగా ఆందోళనే మిగులుతోంది. తాజాగా కాసేపట్లో పెళ్లి జరగాల్సిన ఓ వరుడిని కరోనా బలి తీసుకుంది. పచ్చని పందిట్లో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న ఆ యువకుడిని కరోనా పొట్టనబెట్టుకుంది. ఈ విషాధ ఘటన కర్నూలు జిల్లాలోని ఆదోనిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఆదోనిలోని 11వ వార్డుకు చెందిన 28 ఏళ్ల యువకుడు గతనెల 28న తీవ్ర జ్వరం బారినపడ్డాడు. దీంతో స్థానికంగా ఉండే ఏఎన్‌ఎంను సంప్రదించాడు. ఎందుకైనా మంచిదని ఆమె కరోనా పరీక్షలు నిర్వహించడానికి నమూనాలు సేకరించారు. 
 
ఇంతలో యువకుడి ఆరోగ్యం మరింత క్షీణించింది. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి సదరు యువకుడు మృతి చెందాడు. 
 
తెల్లవారితే పెళ్లి, మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సినవాడిని కరోనా అన్యాయంగా బలి తీసుకుంది. అతని మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా, మృతుడికి ఇటీవలే పెళ్లి కుదిరింది. బుధవారమే పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments