Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్బీఐ నుంచి గుడ్ న్యూస్ .. బంగారంపై రుణాలు.. 90 శాతం పెంపు

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2020 (19:16 IST)
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సామాన్యులను ఊరట నిచ్చే శుభవార్త చెప్పింది. ఇప్పటికే కరోనా కష్టకాలంలో అన్నిరకాల రుణాలపై మారటోరియం గడువు పెంచిన ఆర్బీఐ.. తాజాగా బంగారు ఆభరణాలపై తీసుకునే రుణం విలువను పెంచింది. ఇప్పటివరకు ఆర్బీఐ సూచనలు మేరకు మొత్తం బంగారం విలువలో 75 శాతం విలువ మించకుండా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు రుణం మంజూరు చేస్తాయి. 
 
కానీ ఇప్పుడు అలా కాదు.. బంగారం విలువలో ఇప్పుడు 90 శాతం వరకు రుణం లభిస్తుంది. ఇప్పటివరకు బంగారం మొత్తం విలువలో 75 శాతం మాత్రమే అందుబాటులో ఉంది. ఫలితంగా బంగారు రుణం కోసం దరఖాస్తు చేసుకున్న బ్యాంక్ లేదా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ, మొదట మీ బంగారం నాణ్యతను తనిఖీ చేస్తుంది. 
 
రుణ మొత్తాన్ని బంగారం నాణ్యత ప్రకారం నిర్ణయిస్తారు. బ్యాంకులు సాధారణంగా బంగారం విలువలో 75 శాతం వరకు రుణాలు ఇస్తాయి. కానీ ఆర్బీఐ తాజా సూచనలతో బంగారం రుణం విలువ 90 శాతం పెంచింది. సాధారణంగా, 18 నుండి 24 క్యారెట్ల బంగారం మంచి మొత్తాన్ని ఇస్తుంది.

తాజా మార్గదర్శకాల ప్రకారం గతంలో​ 5 లక్షల రూపాయల విలువైన బంగారంపై 3.75 లక్షల రూపాయల రుణం లభిస్తే ఇప్పుడు అదే విలువ కలిగిన బంగారం తనఖాపై 4.5 లక్షల రూపాయల వరకూ రుణం పొందవచ్చు. కరోనా సంక్షోభంలో ఈ నిర్ణయం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments