Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్బీఐ నుంచి గుడ్ న్యూస్ .. బంగారంపై రుణాలు.. 90 శాతం పెంపు

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2020 (19:16 IST)
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సామాన్యులను ఊరట నిచ్చే శుభవార్త చెప్పింది. ఇప్పటికే కరోనా కష్టకాలంలో అన్నిరకాల రుణాలపై మారటోరియం గడువు పెంచిన ఆర్బీఐ.. తాజాగా బంగారు ఆభరణాలపై తీసుకునే రుణం విలువను పెంచింది. ఇప్పటివరకు ఆర్బీఐ సూచనలు మేరకు మొత్తం బంగారం విలువలో 75 శాతం విలువ మించకుండా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు రుణం మంజూరు చేస్తాయి. 
 
కానీ ఇప్పుడు అలా కాదు.. బంగారం విలువలో ఇప్పుడు 90 శాతం వరకు రుణం లభిస్తుంది. ఇప్పటివరకు బంగారం మొత్తం విలువలో 75 శాతం మాత్రమే అందుబాటులో ఉంది. ఫలితంగా బంగారు రుణం కోసం దరఖాస్తు చేసుకున్న బ్యాంక్ లేదా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ, మొదట మీ బంగారం నాణ్యతను తనిఖీ చేస్తుంది. 
 
రుణ మొత్తాన్ని బంగారం నాణ్యత ప్రకారం నిర్ణయిస్తారు. బ్యాంకులు సాధారణంగా బంగారం విలువలో 75 శాతం వరకు రుణాలు ఇస్తాయి. కానీ ఆర్బీఐ తాజా సూచనలతో బంగారం రుణం విలువ 90 శాతం పెంచింది. సాధారణంగా, 18 నుండి 24 క్యారెట్ల బంగారం మంచి మొత్తాన్ని ఇస్తుంది.

తాజా మార్గదర్శకాల ప్రకారం గతంలో​ 5 లక్షల రూపాయల విలువైన బంగారంపై 3.75 లక్షల రూపాయల రుణం లభిస్తే ఇప్పుడు అదే విలువ కలిగిన బంగారం తనఖాపై 4.5 లక్షల రూపాయల వరకూ రుణం పొందవచ్చు. కరోనా సంక్షోభంలో ఈ నిర్ణయం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments