Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిస్కెట్ తీసుకుందామని యంత్రంలో చేయిపెట్టిన చిన్నారి.. తర్వాత?

సెల్వి
బుధవారం, 4 సెప్టెంబరు 2024 (15:33 IST)
మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ చిన్నారి తల్లి కళ్ల ముందే యంత్రంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే... థానే జిల్లాలోని ఆనంద్‌ నగర్‌ ప్రాంతంలో నివసిస్తున్న పూజా కుమారి.. అంబరనాథ్‌ ప్రాంతంలో ఉన్న ఓ బిస్కెట్‌ కంపెనీలో కార్మికులకు లంచ్‌ బాక్సులు సరఫరా చేస్తుంటారు. 
 
ఈ నేపథ్యంలో మంగళవారం ఆమె లంచ్‌ బాక్సులు ఇవ్వడానికి తన మూడేళ్ల కుమారుడు ఆయుష్‌ చౌహాన్‌ను వెంటబెట్టుకొని ఫ్యాక్టరీకి వెళ్లింది. ఆమె కార్మికులకు లంచ్‌ బాక్సులు ఇస్తున్న సమయంలో చిన్నారికి యంత్రంలోని పడిపోయిన బిస్కెట్‌ ముక్కలు కనిపించాయి. వెంటనే ఆ మెషీన్ లోని బిస్కెట్లు తీసుకునేందుకు ఆ చిన్నారి చేయి చాచింది. అంతే మెషిన్ లో ఉన్న బ్లేడ్‌కు మెడ చిక్కుకోవడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. 
 
కార్మికులు వెంటనే యంత్రాన్ని ఆఫ్‌ చేసి, ఆయుష్‌ను ఉల్హాస్‌నగర్‌లోని సెంట్రల్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 
 
అప్పటి వరకు అల్లరి చేస్తూ తన చుట్టూ తిరిగిన చిన్నారి విగతజీవిగా మారడంతో ఆ తల్లి రోదించిన తీరు అక్కడివారిని కలచివేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

హైద‌రాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల‌కు హీరో కృష్ణసాయి సాయం

థ్రిల్లర్ అయినా కడుపుబ్బా నవ్వించే షోటైం: నవీన్ చంద్ర

Dil Raju: మా రిలేషన్ నెగిటివ్ గా చూడొద్దు, యానిమల్ తో సినిమా చేయబోతున్నా: దిల్ రాజు

మార్గన్ లాంటి చిత్రాలు చేసినా నాలో రొమాంటిక్ హీరో వున్నాడు : విజయ్ ఆంటోని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments