Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను కొడితే నీ ప్యాంటు తడుపుకుంటావ్- రజావత్ నోటి దురుసు

Webdunia
శనివారం, 27 అక్టోబరు 2018 (16:57 IST)
బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరు. తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంలో ముందుండే రాజస్థాన్‌లో అధికార బీజేపీ ఎమ్మెల్యే భవానీ సింగ్‌ రజావత్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి ఏకంగా ఒక ప్రభుత్వాధికారిని దూషిస్తూ బెదిరింపులకు దిగారు. 
 
లడ్‌పురా ఎమ్మెల్యే అయిన రజావత్‌.. కోట జిల్లాలోని భమాషా రైతు మార్కెట్‌ను బుధవారం సందర్శించారు. ధాన్యాల కొనుగోలులో అవకతవకలు జరుగుతున్నాయంటూ మార్కెట్‌ అధికారులను పిలిపించి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఈ సందర్భంగా రాజస్థాన్‌ సహకార మార్క్‌ఫెడ్‌ డిప్యూటీ రిజిస్ట్రార్‌ అజరుసింగ్‌ పన్వార్‌ రజావత్‌ను వేచి వుండేలా చేశారు. దీంతో అక్కడికి చేరిన పన్వార్‌ను చూసి రజావత్‌ కోపోద్రేక్తుడయ్యారు. ఆయనపై తన నోటిదురుసును ప్రదర్శించారు. 
 
'నేను కొడితే నీ ప్యాంటు తడుపుకుంటావ్‌' అని బెదిరిస్తూ పన్వార్‌ను దూషించారు. అయితే రైతుల తరఫున తన గొంతు వినిపిస్తానని ప్రభుత్వాధికారిపై దూషణను అనంతరం తన వ్యాఖ్యలను ఎమ్మెల్యే సమర్థించుకోవడం గమనార్హం.

సంబంధిత వార్తలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

చిన్న సినిమాలను బతికించండి, డర్టీ ఫెలో ప్రీ రిలీజ్ లో దర్శకుడు ఆడారి మూర్తి సాయి

కేన్స్‌లో పదర్శించిన 'కన్నప్ప‌' టీజర్ - మే‌ 30న తెలుగు టీజర్

రేవ్ పార్టీలో హేమ పట్టుబడింది, ఆ వీడియో సంగతి తేలుస్తాం: బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్

బంగారు దుస్తులతో ఆధునిక రావణుడిగా కేజీఎఫ్ హీరో

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments