నేను కొడితే నీ ప్యాంటు తడుపుకుంటావ్- రజావత్ నోటి దురుసు

Webdunia
శనివారం, 27 అక్టోబరు 2018 (16:57 IST)
బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరు. తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంలో ముందుండే రాజస్థాన్‌లో అధికార బీజేపీ ఎమ్మెల్యే భవానీ సింగ్‌ రజావత్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి ఏకంగా ఒక ప్రభుత్వాధికారిని దూషిస్తూ బెదిరింపులకు దిగారు. 
 
లడ్‌పురా ఎమ్మెల్యే అయిన రజావత్‌.. కోట జిల్లాలోని భమాషా రైతు మార్కెట్‌ను బుధవారం సందర్శించారు. ధాన్యాల కొనుగోలులో అవకతవకలు జరుగుతున్నాయంటూ మార్కెట్‌ అధికారులను పిలిపించి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఈ సందర్భంగా రాజస్థాన్‌ సహకార మార్క్‌ఫెడ్‌ డిప్యూటీ రిజిస్ట్రార్‌ అజరుసింగ్‌ పన్వార్‌ రజావత్‌ను వేచి వుండేలా చేశారు. దీంతో అక్కడికి చేరిన పన్వార్‌ను చూసి రజావత్‌ కోపోద్రేక్తుడయ్యారు. ఆయనపై తన నోటిదురుసును ప్రదర్శించారు. 
 
'నేను కొడితే నీ ప్యాంటు తడుపుకుంటావ్‌' అని బెదిరిస్తూ పన్వార్‌ను దూషించారు. అయితే రైతుల తరఫున తన గొంతు వినిపిస్తానని ప్రభుత్వాధికారిపై దూషణను అనంతరం తన వ్యాఖ్యలను ఎమ్మెల్యే సమర్థించుకోవడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments