పెట్రేగిన ఉగ్రవాదులు - కాశ్మీర్‌లో బీజేపీ కౌన్సిలర్‌ను కాల్చివేత

Webdunia
గురువారం, 3 జూన్ 2021 (10:49 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సౌత్ కాశ్మీర్‌లోని థ్రాల్‌ కౌన్సిలర్‌ రాకేశ్‌ పండిత్‌ను ఉగ్రవాదులు బుధవారం రాత్రి కాల్చి చంపారు. ఉగ్రవాదుల బెదిరింపుల నేపథ్యంలో ఆయనకు శ్రీనగర్‌లో ప్రభుత్వ వసతి, ఇద్దరు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని నియమించారు. 
 
ఉగ్రవాదులకు పట్టున్న, ఆయన స్వస్థలమైన థ్రాల్‌లో భద్రతా సిబ్బంది లేకుండా బుధవారం పర్యటించారని, ఈ క్రమంలో ముగ్గురు గుర్తు తెలియని ఉగ్రవాదులు కాల్పులు జరిపారని పోలీసులు చెప్పారు. ఘటనలో అతని స్నేహితుడి కుమార్తె సైతం తీవ్రంగా గాయపడిందని పోలీసులు పేర్కొన్నారు. నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు.
 
ఈ యేడాదిలో కాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడుల్లో ముగ్గురు కౌన్సిలర్లు ప్రాణాలు కోల్పోయారు. మార్చి 30న ఉగ్రవాదులు సోపోర్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ కార్యాలయంలోకి చొరబడి ఇద్దరు కౌన్సిలర్లతో పాటు ఓ పోలీస్‌ అధికారి కాల్చి చంపారు. 
 
కౌన్సిలర్ రాకేశ్​ పండిట్​ హత్యను జమ్మూకాశ్మీర్‌ లెఫ్టినెంట్​ గవర్నర్​ మనోజ్​ సిన్హా తీవ్రంగా ఖండించారు. రాకేశ్​ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. హత్యపై బీజేపీ ప్రతినిధి అల్తాఫ్‌ ఠాకూర్‌ ఖండించారు. ఇలాంటి దాడులు బీజేపీ నాయకులను ప్రజలకుసేవ చేయకుండా ఆపలేవన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments