Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరద నీటిలో చిక్కుకున్న హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్.. బోగీల్లోకి నీరు (వీడియో)

హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ వరద నీటిలో చిక్కుకుంది. రైలు బోగీల్లోకి నీరు చేరింది. దీంతో ప్రయాణికులు భయాందోళనలో ఉన్నారు. ఒడిషా రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెల్సిందే. ఎడతెరపిల

Webdunia
శనివారం, 21 జులై 2018 (13:07 IST)
హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ వరద నీటిలో చిక్కుకుంది. రైలు బోగీల్లోకి నీరు చేరింది. దీంతో ప్రయాణికులు భయాందోళనలో ఉన్నారు. ఒడిషా రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెల్సిందే. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఒడిశా అతలాకుతలమైంది. రాయ్‌గఢ్‌ జిల్లాలో భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రైల్వే ట్రాక్‌లపైకి కూడా వరదనీరు వచ్చి చేరడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
 
ముఖ్యంగా, రాయ్‌గఢ్‌ జిల్లా లక్ష్మీపురం సమీపంలోని బాలుమస్కా స్టేషన్ వద్ద భువనేశ్వర్ నుంచి జగ్దల్‌పూర్ వెళ్తున్న హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు వరద నీటిలో చిక్కుకుపోయింది. ట్రైన్ బోగీలోకి నీరు వచ్చి చేరింది. వరద నీటిలో ట్రైన్ చిక్కుకుపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. వరద ఉధృతి తగ్గాక ట్రైన్ కదిలే అవకాశం ఉంది. అలాగే మరో ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ సింగిపురం టికిరి స్టేషన్ల మధ్య చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments