Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోకాళ్ళపై కూర్చోబెట్టి గుంజిళ్లు తీయించారు.. ఎందుకు?

Webdunia
సోమవారం, 8 జులై 2019 (15:01 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో గోసంరక్షకులు చేష్టలు శృతిమించిపోతున్నాయి. జంతు ప్రదర్శనకు గోవులను తరలిస్తున్నారన్న ఆరోపణలపై 24 మందిని అదుపులోకి తీసుకున్న గోసంరక్షకులు... వారిని మోకాళ్ళపై కూర్చోబెట్టి గుంజిళ్లు తీయించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లా నుంచి మహారాష్ట్రలో జరుగుతున్న ఓ జంతు ప్రదర్శనకు కొంతమంది గోవులను తరలిస్తున్నారు. ఈ విషయం కొంతమంద గోసంరక్షకుల దృష్టికెళ్లింది. అయితే, ఈ గోవులను గోవధకు తరలిస్తున్నారని గోసంరక్షకులు భావించి, వారందరినీ అడ్డుకున్నారు. 
 
ఆ తర్వాత చేతులను తాళ్ళతో కట్టేసి మోకాళ్లపై కూర్చోబెట్టి గుంజిళ్లు తీయించారు. వారితో బలవంతంగా గోమాతాకీ జై అంటూ నినాదాలు చేయించారు. ఆ తర్వాత వారిని తన్నుకుంటూ ఊరేగించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. గోవులను తరలిస్తున్న వారితో పాటు వారిని హింసించిన గోసంరక్షకులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో 16 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments