మోకాళ్ళపై కూర్చోబెట్టి గుంజిళ్లు తీయించారు.. ఎందుకు?

Webdunia
సోమవారం, 8 జులై 2019 (15:01 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో గోసంరక్షకులు చేష్టలు శృతిమించిపోతున్నాయి. జంతు ప్రదర్శనకు గోవులను తరలిస్తున్నారన్న ఆరోపణలపై 24 మందిని అదుపులోకి తీసుకున్న గోసంరక్షకులు... వారిని మోకాళ్ళపై కూర్చోబెట్టి గుంజిళ్లు తీయించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లా నుంచి మహారాష్ట్రలో జరుగుతున్న ఓ జంతు ప్రదర్శనకు కొంతమంది గోవులను తరలిస్తున్నారు. ఈ విషయం కొంతమంద గోసంరక్షకుల దృష్టికెళ్లింది. అయితే, ఈ గోవులను గోవధకు తరలిస్తున్నారని గోసంరక్షకులు భావించి, వారందరినీ అడ్డుకున్నారు. 
 
ఆ తర్వాత చేతులను తాళ్ళతో కట్టేసి మోకాళ్లపై కూర్చోబెట్టి గుంజిళ్లు తీయించారు. వారితో బలవంతంగా గోమాతాకీ జై అంటూ నినాదాలు చేయించారు. ఆ తర్వాత వారిని తన్నుకుంటూ ఊరేగించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. గోవులను తరలిస్తున్న వారితో పాటు వారిని హింసించిన గోసంరక్షకులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో 16 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments