Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వీట్స్ కొనిస్తామని.. బాలికపై మూడు నెలలుగా గ్యాంగ్ రేప్.. వృద్ధుడు కూడా..

బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. పదేళ్ల బాలికపై నలుగురు కామాంధులు మూడు నెలల పాటు అత్యాచారానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పదేళ్ల బాలికకు స్వీట

Webdunia
శనివారం, 18 నవంబరు 2017 (13:40 IST)
బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. పదేళ్ల బాలికపై నలుగురు కామాంధులు మూడు నెలల పాటు అత్యాచారానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పదేళ్ల బాలికకు స్వీట్లు ఆశగా చూపి నలుగురు వ్యక్తులు మూడు నెలలుగా పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఐదో తరగతి చదువుతున్న బాలికపై.. వాచ్‌మన్‌గా పని చేస్తూ అదే కాలనీలో నివాసం ఉంటున్న నన్హూలాల్‌ (65), మరో ముగ్గురు వ్యక్తులు గోకుల్‌ పన్వాల్‌ (42), గ్యానేంద్ర పండిట్‌ (34), సుమన్‌పాండే (49) గత మూడు నెలల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. నవంబర్ 12 కూడా బాలికపై ఈ నలుగురు అత్యాచారం చేశారు. 
 
అయితే వారి బెదిరింపులకు జడుసుకున్న బాలిక తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పలేదు. కానీ బాలిక ప్రవర్తనలో తేడా గమనించిన ఆమె తల్లిదండ్రులు విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో స్వీట్లు తీసిస్తామని ఆ బాలికను లొంగ దీసుకున్న దుండగులు.. అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డారని వెల్లడైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం