Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిలాఫలకం వేశా... వచ్చారో కాళ్లూ చేతులూ నరికేస్తా : ఎమ్మెల్యే వార్నింగ్

Webdunia
ఆదివారం, 6 జనవరి 2019 (15:05 IST)
కర్ణాటక శాఖ అటవీ శాఖ అధికారిపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే బీకే సంగమేశ్వర రెచ్చిపోయారు. బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ శిలాఫలకం వేశాను. పనులు కూడా ప్రారంభమవుతున్నాయి. అడ్డుకునేందుకు ఏ ఒక్క అధికారి ఇక్కడకు రాకూడదు. వచ్చారో కాళ్లూ చేతులు నరికేస్తా. మంచి మాటలు మీచెవికెక్కవు. ఇదే నా హెచ్చరిక అంటూ ఎమ్మెల్యే రెచ్చిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతూ వివాదం రేపుతోంది.
 
కర్ణాటక రాష్ట్రంలోని భద్రావతి ప్రాంతంలో ఆలయ నిర్మాణం చేపట్టాలని కొందరు గ్రామస్థులు నిర్ణయించారు. అనుకున్నదే తడవు డిసెంబరు 31వ తేదీన శంకుస్థాపన కూడా జరిపించారు. అయితే ఆ నిర్మాణంపై అటవీ శాఖ అధికారి ఒకరు అభ్యంతరం వ్యక్తంచేశారు. అటవీ శాఖ భూమిలో ఎలాంటి నిర్మాణం చేపట్టాలన్నా ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అధికారి చెప్పారు. 
 
ఈ విషయాన్ని ఎమ్మెల్యే సంగమేశ్వరర్ దృష్టిసారించారు. దీంతో సదరు అధికారికి సంగమేశ్వర్ నేరుగా ఫోను చేశారు. స్వయంగా తానే ఇక్కడ శిలాఫలకం వేశానని, పని కూడా మొదలవుతుందని చెబుతూ... ఎవరైనా అడ్డుకుంటే కాళ్లూ చేతులూ నరికేస్తామంటూ హెచ్చరించారు. ఈ వ్యవహారం మొత్తం వీడియోలో రికార్డు కావడంతో ఎమ్మెల్యే వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments