Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యూటీపార్లర్‌కు వెళ్లిన వధువు.. అట్టే ప్రియుడితో జంప్

Webdunia
శనివారం, 21 మే 2022 (15:04 IST)
మేకప్ కోసం వధువు బ్యూటీపార్లర్‌కు వెళ్లింది. గంటలైనా తిరిగి రాకపోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఎక్కడ వెతికినా వధువు కనిపించలేదు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం తెలిసింది. పెళ్లికి కేవలం రెండు గంటల ముందు వధువు తన ప్రియుడితో వెళ్లిపోయిందని తెలిసింది.
 
వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన జితేంద్ర అనే వ్యక్తికి ఎమ్‌జీ రోడ్ కాలనీకి చెందిన రోషిణీతో వివాహం నిశ్చయమైంది. గురువారం సాయంత్రం వీరి వివాహం జరగాల్సి ఉంది. గురువారం ఉదయమే వరుడి కుటుంబం కల్యాణ మండపానికి చేరుకుంది. 
 
వధువు కుటుంబం వారికి ఆహ్వానం పలికింది. పెళ్లికి రెండు గంటల సమయం ఉందనగా వధువు రోషిణి బ్యూటీ పార్లర్‌కు వెళ్తానని తల్లిదండ్రులకు చెప్పి బయటకు వెళ్లింది. ముహూర్త సమయం దగ్గరపడుతున్నప్పటికీ ఆమె తిరిగి రాలేదు.
 
వధువు కుటుంబ సభ్యలతో పాటు స్వయంగా వరుడు కూడా రోషిణి కోసం వెతికాడు. ఎక్కడా ఆమె ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అసలు విషయం తెలిసింది. ఆకాష్ అనే వ్యక్తితో రోషిణి ప్రేమలో ఉందని, అతడితోనే వెళ్లిపోయిందని తెలిసింది. ఇద్దరి ఫోన్లూ స్విచ్ఛాఫ్ రావడంతో చేసేదేం లేక వరుడి కుటుంబం వెనుదిరిగింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments