Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విశాఖ వధువు గుండెపోటుతో చనిపోలేదు... గన్నేరు పప్పు తిని ప్రాణం తీసుకున్నది, కారణం అదేనా?

deadbody
, గురువారం, 12 మే 2022 (20:30 IST)
విశాఖపట్టణంలో పెళ్లిపీటలపై వధువు తలపై వరుడు జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో వధువు కుప్పకూలిపోయి గుండెపోటుతో చనిపోయిందంటూ జరిగిన ప్రచారంలో నిజం లేదని తేలింది. పోస్టుమార్టం రిపోర్టులో వధువు గన్నేరుపప్పు తిని చనిపోయినట్లు తేలింది. ఇష్టం లేని పెళ్లి కారణంగానే ఆమె ఈ పని చేసిందని అంటున్నారు.

 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విశాఖపట్టణం జిల్లా మధురవాడలో బుధవారం రాత్రి వివాహ వేడుకల జరుగుతుంది. సరిగ్గా జీలకర్ర, బెల్లం పెట్టే సమయంలో వధులు స్పృహ కోల్పోయి కుప్పకూలిపడిపోయింది. 

 
దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ గురువారం ఉదయం కన్నుమూసింది. వివాహ వేడుకలో ఎంతో సంతోషంగా గడపాల్సిన వధూవరుల ఇళ్ళలో తీవ్ర విషాద ఘటన జరిగింది. ఆమె గుండెపోటుతో చనిపోయి వుంటుందని అంతా అనుకున్నారు కానీ ఆమె గన్నేరు పప్పు తిని ప్రాణాలు తీసుకున్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వర్క్ ఫ్రమ్ హోమ్ వద్దన్నందుకు రూ. 8 కోట్ల ఉద్యోగానికి రాజీనామా.. ఎవరు?