హస్తిన పర్యటనలో సీఎం కేసీఆర్ - అఖిలేష్ యాదవ్‌తో భేటీ

Webdunia
శనివారం, 21 మే 2022 (14:59 IST)
దేశ వ్యాప్త పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు. ప్రస్తుతం హస్తినలో ఉంటున్న ఆయన శనివారం ఢిల్లీలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీ సీఎం కేసీఆర్ నివాసంలో కొనసాగుతోంది. 
 
ఇందులో జాతీయ రాజకీయాలు, దేశ పరిస్థితులు, ప్రాంతీయ పార్టీల బలాలు, దేశంలో ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పన వంటి అంశాలపై చర్చిస్తున్నారు. అలాగే, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర, జాతీయ స్థాయిలో చోటుచేసుకున్న పరిణామాలపై వారిరువురు చర్చించారు. 
 
మరోవైపు, శనివారం సాయంత్రం ఆయన ఢిల్లీలో మొహల్లా క్లినిక్‌ను కూడా సందర్శించనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి చండీగఢ్‌కు వెళతారు. అక్కడ కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ సాగిన ఆందోళనలో అశువులు బాసిన రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించి, ఒక్కో రైతు కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ కూడా పాల్గొంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గౌతమి చౌదరి వర్సెస్ ధర్మ మహేష్.. భార్యపై కేసు పెట్టాడు.. కారణం ఏంటంటే?

Sudheer Babu: ఇండస్ట్రీ బ్యాగ్రౌండ్ లేనివారికి కష్టం, అందుకే అలా మాట్లాడా : హీరో సుధీర్ బాబు

Chinmayi: సజ్జనార్‌కు ఫిర్యాదు చేసిన చిన్మయి శ్రీపాద

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments