Webdunia - Bharat's app for daily news and videos

Install App

హస్తిన పర్యటనలో సీఎం కేసీఆర్ - అఖిలేష్ యాదవ్‌తో భేటీ

Webdunia
శనివారం, 21 మే 2022 (14:59 IST)
దేశ వ్యాప్త పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు. ప్రస్తుతం హస్తినలో ఉంటున్న ఆయన శనివారం ఢిల్లీలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీ సీఎం కేసీఆర్ నివాసంలో కొనసాగుతోంది. 
 
ఇందులో జాతీయ రాజకీయాలు, దేశ పరిస్థితులు, ప్రాంతీయ పార్టీల బలాలు, దేశంలో ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పన వంటి అంశాలపై చర్చిస్తున్నారు. అలాగే, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర, జాతీయ స్థాయిలో చోటుచేసుకున్న పరిణామాలపై వారిరువురు చర్చించారు. 
 
మరోవైపు, శనివారం సాయంత్రం ఆయన ఢిల్లీలో మొహల్లా క్లినిక్‌ను కూడా సందర్శించనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి చండీగఢ్‌కు వెళతారు. అక్కడ కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ సాగిన ఆందోళనలో అశువులు బాసిన రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించి, ఒక్కో రైతు కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ కూడా పాల్గొంటారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments