Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శోభనం గదికి వెళ్ళిన వరుడికి షాక్.. వధువు ఏం చేసిందో తెలుసా?

bride
, శుక్రవారం, 13 మే 2022 (20:34 IST)
శోభనం గదికి వెళ్ళిన వరుడికి షాక్ తప్పలేదు.  అందంగా ముస్తాబైన వధువు పాల గ్లాసు, స్వీట్లతో గదిలోకి  వచ్చిన కొత్త పెళ్లి కూతురు.. పీరియడ్స్ అని చెప్పడంతో వరుడు షాక్ అయ్యాడు. అంతేగాకుండా తనకు పీరియడ్ స్టార్ట్ అయిందని.. మరో వారం రోజులపాటు శోభనాన్ని వాయిదా వేయాలని కోరింది. దీంతో చేసేదేం లేక కుటుంబీకులు ఆ కార్యాన్ని వాయిదా వేశారు.
 
ఇంతలో పని కానిచ్చేసింది. ఏం చేసిందంటే.. వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాహుల్‌ పది రోజుల క్రితం లలిత అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. బంధువుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లైన మూడు రోజుల తర్వాత నవ దంపతులకు బంధువులు శోభనం ఏర్పాటు చేశారు. ఇంతలో పీరియడ్స్ అని శోభనాన్ని వాయిదా వేసింది.  
 
సరిగ్గా వారం గడిచే సరికి నవ వధువు లలిత.. అత్తగారి ఇంట్లో ఉన్న రూ.3 లక్షల నగదుతోపాటు బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలతో మూటకట్టుకుని తెల్లారేసరికి పరారీ అయింది. ఈ విషయం తెలిసి   అత్తమామలు షాకై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఈ దొంగ వధువు లలిత.. మరి కొంతమందితో ముఠాగా ఏర్పడి దొంగ వివాహాలు చేసుకుంటూ మోసం చేస్తున్నట్లు తేలింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

14న తెలంగాణా పర్యటనకు వస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా