Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య తీర్పు నేపథ్యంలో భారత్‌లో ఉగ్ర దాడులకు ప్లాన్

Webdunia
ఆదివారం, 10 నవంబరు 2019 (15:34 IST)
దశాబ్దాల తరబడి వివాదంగా ఉన్న అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించింది. ఈ తీర్పు అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉంది. వివాదాస్పద అయోధ్య స్థలం హిందువులదేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
 
ఈ నేపథ్యంలో జైషే మహ్మద్ ఉగ్రవాదులు భారత్‌లో దాడులకు దిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. నిజానికి అయోధ్య తీర్పు వెల్లడి కావడానికి ముందు నుంచే ఉగ్ర సంస్థలు భారత్‌లో భారీ విధ్వంసానికి ప్రణాళికలు వేసుకున్నాయని కేంద్ర ప్రభుత్వానికి భారత మిలటరీ ఇంటెలిజెన్స్‌, రా, ఇంటెలిజెన్స్‌ బ్యూరో వంటి సంస్థలు తెలిపాయి.
 
దీంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాదుల ప్రతిపాదిత లక్ష్యాలను ముందుగానే పసిగట్టి ఈ దాడులను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఉగ్రవాదులు జరపవచ్చని నిఘా సంస్థలు చెప్పాయి. 
 
ఈ నేపథ్యంలో అయోధ్య తీర్పును పాకిస్థాన్ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ తీర్పుతో భారత్‌లో మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందనే విషయం తేటతెల్లమైందని ఆరోపించింది. దీనికితోడు ఉగ్రమూకలు సైతం దేశంలో దాడులకు తెగబడేందుకు సిద్ధమయ్యారని నిఘా వర్గాలు హెచ్చరిక చేశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments