Webdunia - Bharat's app for daily news and videos

Install App

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో హిమపాతం బీభత్సం-చిక్కుకున్న 57మంది.. 15మంది సేఫ్

సెల్వి
శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025 (16:45 IST)
Uttarakhand
ఉత్తరాఖండ్‌లో హిమపాతం బీభత్సం సృష్టించింది. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో భారీ హిమపాతం కారణంగా 57 మంది కార్మికులు మంచు చరియల కిందనే చిక్కుకుపోయారని తెలుస్తోంది. వారిలో 15మందిని సహాయక బృందాలు కాపాడాయి. మిగతా వారిని రక్షించడానికి రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఇప్పటికీ మంచు దట్టంగా కురుస్తుండడంతో రెస్క్యూ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
 
సైనికుల కోసం వేస్తున్న రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా అక్కడి మంచును కార్మికులు తొలగిస్తున్న సమయంలో హిమపాతం వారిని ముంచేసింది. ఈ ప్రాంతంలో ఐటీబీపీ, బీఆర్వో, ఇతర రెస్క్యూ టీమ్‌లు రెస్క్యూ ఆపరేషన్‌లను నిర్వహిస్తున్నాయి. బద్రీనాథ్‌కు దగ్గరలోని మనా గ్రామంలోని బీఆర్వో శిబిరానికి సమీపంలో ఈ విషాదకర ఘటన జరిగింది. 
 
ప్రతికూల వాతావరణ పరిస్థితులను కూడా అధిగమించి బాధితులను రక్షించేందుకు ఆర్మీ, ఎస్‌డీఆర్ఎఫ్, స్థానిక అధికారులు ఆపరేషన్ సాగిస్తున్నట్టు ఉత్తరాఖండ్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ప్రతినిధి, ఐజీ నీలేష్ ఆనంద్ భర్నే తెలిపారు. మరోవైపు,మంచు చరియలు విరిగిపడుతుండటంతో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments