Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరెంట్ షాక్‌తో చనిపోతే అమరవీరులని అంటామా..? శిఖా శర్మ అరెస్ట్

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (22:59 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా-బీజాపూర్ సరిహద్దుల్లో శనివారం మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో సెర్చ్ ఆపరేషన్ కోసం వెళ్లిన 22 మంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా వాంటెడ్ మావోయిస్టు నేత హిడ్మా ఉన్నట్లు ఇంటెలీజెన్స్ వర్గాలు వెల్లడించాయి.

ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ అడవుల్లో నక్సల్స్‌తో జరిగిన కాల్పుల్లో అమరులైన భద్రతా బలగాల సిబ్బంది గురించి అస్సోం రచయిత్రి శిఖా శర్మ తన ఫేస్‌బుక్‌లో వివాదాస్పద పోస్ట్ పెట్టారు. ఫలితంగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
 
అమరులైన 22 మంది జవాన్ల గురించి ఎఫ్‌బీలో పోస్ట్ పెట్టిన ఆమె.. జీతాలు తీసుకుంటూ డ్యూటీలో భాగంగా చనిపోయిన వారిని అమరవీరులని పిలవొద్దని, 'విద్యుత్ శాఖలో పనిచేసే సిబ్బంది కరెంట్ షాక్‌తో చనిపోతే వారిని అమరవీరులని అంటామా' అని లాజిక్ చెబుతూ మరీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. మీడియా ప్రజలను భావోద్వేగానికి గురిచేయొద్దని ఆమె సూచించారు. 
 
శిఖా శర్మ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శల పాలైంది. నక్సల్స్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల పట్ల కనీస సానుభూతి కూడా లేకుండా ఇలాంటి పోస్ట్‌లు పెట్టడం ఆమె దిగజారుడు ఆలోచనలకు నిదర్శనమని నెటిజన్లు మండిపడ్డారు. 
 
అమరులైన జవాన్ల గురించి అనుచిత పోస్ట్ పెట్టిన ఆమెపై దిస్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దేశద్రోహం కేసుతో పాటు పలు కేసులను ఆమెపై నమోదు చేసినట్లు గువహటి సిటీ పోలీస్ కమిషనర్ మున్నా ప్రసాద్ గుప్తా తెలిపారు. ఆమెను కోర్టును ప్రవేశపెట్టినట్లు చెప్పారు. కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments