Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కరోనా వైరస్ విజృంభణ.. 24 గంటల్లో 2331 కేసులు.. 11మంది మృతి

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (22:36 IST)
ఏపీలో కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చింది. రోజు రోజుకూ కేసులు సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. తాజాగా రాష్ట్రంలో కేసులు 2 వేల మార్క్ కూడా దాటిపోయాయి. గత 24 గంటల వ్యవధిలో 31,812 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 2331 మందికి పాజిటివ్ అని తేలింది. ఇందులో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 368, కృష్ణా జిల్లాలో 327 కేసులు వెలుగుచూశాయి. 
 
ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి మొత్తం 11మంది మృతి చెందగా, ఇప్పటివరకు 7,262 మంది మరణించారు.  
 
చిత్తూరు జిల్లాలో నలుగురు, కర్నూల్‌లో ఇద్దరు, అనంతపురం, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు అలాగే విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. ఏపీలో ప్రస్తుతం 13,276 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 1,53,02,583 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
 
తాజా కేసులతో ఇప్పటివరకు ఏపీలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,10,379కి చేరింది. ఇందులో ఇప్పటికే 8,89,841 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక యాక్టివ్ కేసులు 1300 దాటిపోయాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 13,276 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments